News March 17, 2024

రాష్ట్రంలో విపరీతంగా పెరగబోతున్న దిగజారుడు రాజకీయాలు: YCP

image

AP: ఇవాళ జరగబోయే ‘ప్రజాగళం’ సభపై వైసీపీ సెటైర్లు వేసింది. ‘ఈరోజు మధ్యాహ్నం 4 గంటలకు ఏపీలో విపరీతంగా పెరగబోతున్న దిగజారుడు రాజకీయాలు’ అని ట్వీట్ చేసింది. దీనికి గతంలో చంద్రబాబు ప్రధానిని విమర్శిస్తూ చేసిన ట్వీట్‌ను ట్యాగ్ చేసింది. కాగా సాయంత్రం టీడీపీ-బీజేపీ-జనసేన సంయుక్తంగా ‘ప్రజాగళం’ సభ నిర్వహించనున్నాయి. దీనికి ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు, పవన్ హాజరవుతారు.

Similar News

News October 26, 2025

దూసుకొస్తున్న తుఫాను.. 20 జిల్లాల్లో సెలవులు

image

AP: ‘మొంథా’ తుఫాను రాష్ట్ర తీర ప్రాంతం వైపు దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 20జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అనంతపురం, సత్యసాయి, నంద్యాల, KNL, తిరుపతి, SKL జిల్లాల్లో హాలిడేస్ ఇవ్వలేదు. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంది. తీవ్ర ప్రభావం చూపే కాకినాడ జిల్లాలో 27 నుంచి 31 వరకు హాలిడే ప్రకటించారు. మిగతా జిల్లాల్లో 1 నుంచి 3 రోజుల వరకు సెలవులిచ్చారు.

News October 26, 2025

మొంథా తుఫాను పయనమిలా..

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం గడిచిన 6 గంటల్లో 8Kmph వేగంతో కదిలిందని APSDMA తెలిపింది. ప్రస్తుతానికి చెన్నైకి 720km, విశాఖపట్నానికి 790km, కాకినాడకి 780km దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ఇది 12 గంటల్లో నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతుందని తెలిపింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి, ఆరోజు రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే ఛాన్స్ ఉందని పేర్కొంది.

News October 26, 2025

నాతో పార్టీ పెట్టించే అవసరం కేసీఆర్‌కు లేదు: కవిత

image

TG: తనతో పార్టీ పెట్టించే అవసరం కేసీఆర్‌కు లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా NZBలో మీడియాతో మాట్లాడారు. ‘అందరికీ మంచి జరగాలనే జనం బాట చేపట్టాం. రాజకీయ పార్టీ అవసరమైతే పెడతాం. నన్ను బయటికి పంపి పార్టీ పెట్టించే అవసరం KCRకు లేదు. KCRను, BRSను ఇష్యూ బేస్డ్‌గానే విమర్శిస్తాను. కాంగ్రెస్ ఓ మునిగిపోయే నావ. ఆ పార్టీ నాకు మద్దతు ఇవ్వటమేంటి?’ అని వ్యాఖ్యానించారు.