News March 17, 2024

రాజోలులో మరోసారి జనసేన జెండా ఎగరేసేనా..?

image

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలోనూ రాజోలులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ 814 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఇది రాష్ట్రంలో 2వ అత్యల్ప మెజారిటీ. కొద్ది రోజులకే రాపాక YCPలో చేరగా.. తాజాగా MP సీటు దక్కించుకున్నారు. దీంతో రాజోలులో జనసేన నుంచి దేవా వరప్రసాద్‌ MLA బరిలో ఉన్నారు. YCP నుంచి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు బరిలో ఉన్నారు. మరి జనసేన మరోసారి జెండా ఎగరేసేనా..?

Similar News

News January 15, 2026

తూ.గో: యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు

image

భక్తుడికి అన్యాయం జరుగుతుంటే దేవుడు చూస్తే ఉరుకోడని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.శ్యామల పేర్కొన్నారు. ఫ్లెక్సీ ఘటనలో అరెస్టై, విడుదలైన వైసీపీ కార్యకర్తలను తూర్పు చోడవరంలో బుధవారం ఆమె పరామర్శించారు. వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి భక్తులకు అన్యాయం జరిగిందంటే దేవుడు ఊరుకోడని, తప్పకుండా స్పందిస్తారని ఆమె వెల్లడించారు. కార్యకర్తలకు భరోసా ఇచ్చి ధైర్యం చెప్పారు.

News January 15, 2026

కొవ్వూరు: కోడిపందేల్లో గెలిస్తే మోటార్ సైకిళ్లు గిఫ్ట్

image

కొవ్వూరు మండలం ఐపంగిడిలో బుధవారం కోడిపందేల నిర్వాహకులు బంపర్ ఆఫర్లు ప్రకటించారు. పందేల్లో గెలిచిన పుంజుల యజమానులకు మోటార్ సైకిళ్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించి, బరుల వద్ద వాటిని ప్రదర్శనకు ఉంచారు. ఒక శిబిరంలో ఆరు పుంజుల పోటీలో నెగ్గిన వారికి, మరోచోట ఇద్దరు విజేతలకు బైక్‌లు అందజేస్తామన్నారు. పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు నిర్వాహకులు ఇలాంటి భారీ ఆఫర్లు ప్రకటించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

News January 15, 2026

కొవ్వూరు: కోడిపందేల్లో గెలిస్తే మోటార్ సైకిళ్లు గిఫ్ట్

image

కొవ్వూరు మండలం ఐపంగిడిలో బుధవారం కోడిపందేల నిర్వాహకులు బంపర్ ఆఫర్లు ప్రకటించారు. పందేల్లో గెలిచిన పుంజుల యజమానులకు మోటార్ సైకిళ్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించి, బరుల వద్ద వాటిని ప్రదర్శనకు ఉంచారు. ఒక శిబిరంలో ఆరు పుంజుల పోటీలో నెగ్గిన వారికి, మరోచోట ఇద్దరు విజేతలకు బైక్‌లు అందజేస్తామన్నారు. పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు నిర్వాహకులు ఇలాంటి భారీ ఆఫర్లు ప్రకటించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.