News March 17, 2024

రాజోలులో మరోసారి జనసేన జెండా ఎగరేసేనా..?

image

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలోనూ రాజోలులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ 814 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. ఇది రాష్ట్రంలో 2వ అత్యల్ప మెజారిటీ. కొద్ది రోజులకే రాపాక YCPలో చేరగా.. తాజాగా MP సీటు దక్కించుకున్నారు. దీంతో రాజోలులో జనసేన నుంచి దేవా వరప్రసాద్‌ MLA బరిలో ఉన్నారు. YCP నుంచి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు బరిలో ఉన్నారు. మరి జనసేన మరోసారి జెండా ఎగరేసేనా..?

Similar News

News February 16, 2025

గోకవరం: స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ 

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రరతిష్టాత్మకంగా చేపట్టిన స్వేచ్ఛ స్వర్ణాంధ్ర కార్యక్రమం గోకవరం మండలం అచ్చుతాపురం గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి పాల్గొని ఇంకుడు గుంటలు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ అప్పలరాజు, తదితర మండల నాయకులు పాల్గొన్నారు.

News February 15, 2025

గోకవరం: స్కూల్ బస్సు ఢీకొని విద్యార్థి మృతి

image

గోకవరం మండలం వెదురుపాక గ్రామానికి చెందిన కుంచే నాగేంద్ర (5) ప్రైవేటు స్కూల్ బస్సు ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం సాయంత్రం జరిగింది. మృతి చెందిన విద్యార్థి  కోరుకొండలో ప్రైవేట్ స్కూల్లో ఎల్‌కేజీ  చదువుతున్నాడు. ఈ సంఘటనతో వెదురుపాకలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 15, 2025

రాజమండ్రి: దొంగ నోట్ల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

image

బిక్కవోలు కేంద్రంగా దోంగ నోట్లును ముద్రిస్తున్న ఐదుగురి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం స్థానిక పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ డి. నరసింహ కిషోర్ మాట్లాడుతూ.. దొంగ నోట్లు ముద్రిస్తున్న ముఠా నుంచి 1.07 కోట్ల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేశామన్నారు. బిక్కవోలుకు చెందిన మెకానిక్ నకిలీ నోట్లను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసి నకిలీ నోట్ల గుట్టురట్టు చేశారు.

error: Content is protected !!