News January 9, 2025
ఏసీబీ విచారణకు బయల్దేరిన కేటీఆర్

TG: ఫార్ములా-e రేసు కేసులో KTR నందినగర్ నివాసం నుంచి ఏసీబీ విచారణకు బయల్దేరారు. కేటీఆర్ లాయర్, మాజీ ఏఏజీ రామచందర్ రావు ఆయనతో పాటు వెళ్తున్నారు. కాగా, విచారణ జరిగే గది పక్కనే ఉన్న లైబ్రరీ రూం వరకే లాయర్ను అనుమతించనున్నారు. కేటీఆర్ విచారణ దృష్ట్యా అప్రమత్తమైన పోలీసులు ACB ఆఫీస్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. IAS దాన కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు KTRను విచారించనున్నారు.
Similar News
News April 16, 2026
మీ మేనత్తలు ఎవరో నీకు తెలుసా?.. లోకేశ్కు YCP కౌంటర్

AP: వైఎస్ జగన్ తల్లిని, చెల్లిని తరిమేశారంటూ మంత్రి లోకేశ్ చేసిన <<19664163>>విమర్శలకు<<>> వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ‘మీ మేనత్తలు ఎవరో నీకు తెలుసా? ఏ రోజు అయినా ఇంటికి పిలిచి పట్టెడన్నం పెట్టావా? మీ బాబాయ్ రామ్మూర్తి నాయుడిని ఎందుకు గొలుసులతో కట్టేశారు? మీ నాన్నమ్మ చనిపోతే మీ నాన్న ఎందుకు తలకొరివి కూడా పెట్టలేదు? నువ్వు ఒకటి అంటే మేము పది అనగలం. ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు’ అని వార్నింగ్ ఇచ్చింది.
News April 16, 2026
SRHకు షాక్.. IPL నుంచి మరో బౌలర్ ఔట్

IPL: SRH బౌలర్ డేవిడ్ పేన్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ఆయన కాలి మడమ గాయంతో బాధపడుతున్నట్లు పేర్కొంది. కాగా అంతకుముందు గాయంతో టోర్నీకి దూరమైన జాక్ ఎడ్వర్డ్స్ స్థానంలో <<19463818>>పేన్<<>> జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
News April 16, 2026
ఏపీలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రారంభం.. వివరాలు నమోదు చేసుకున్న సీఎం

AP: స్వీయ జనగణనలో భాగంగా CM చంద్రబాబు తన వివరాలను ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు. http://se.census.gov.in సైట్ ద్వారా మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను ఏపీ జనగణన డైరెక్టర్ జె.నివాస్ సీఎంకు వివరించారు. ఈ నెల 30 వరకు ప్రజలు ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. మే 1 తేదీ నుంచి 30 వరకూ అధికారులు క్షేత్రస్థాయిలో ఇళ్ల గణన ప్రక్రియను చేపడతారని తెలిపారు.


