News January 9, 2025
ఏసీబీ విచారణకు బయల్దేరిన కేటీఆర్

TG: ఫార్ములా-e రేసు కేసులో KTR నందినగర్ నివాసం నుంచి ఏసీబీ విచారణకు బయల్దేరారు. కేటీఆర్ లాయర్, మాజీ ఏఏజీ రామచందర్ రావు ఆయనతో పాటు వెళ్తున్నారు. కాగా, విచారణ జరిగే గది పక్కనే ఉన్న లైబ్రరీ రూం వరకే లాయర్ను అనుమతించనున్నారు. కేటీఆర్ విచారణ దృష్ట్యా అప్రమత్తమైన పోలీసులు ACB ఆఫీస్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. IAS దాన కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు KTRను విచారించనున్నారు.
Similar News
News March 7, 2026
నాలుగుసార్లు ప్రధాని.. చిత్తుగా ఓడిపోయారు

నేపాల్ రాజకీయాల్లో సంచలనం నమోదైంది. ఆ దేశానికి నాలుగుసార్లు ప్రధానిగా పనిచేసిన కేపీ శర్మ ఓలీ(CPN-UML) సొంత నియోజకవర్గం జాఫా-5లో చిత్తుగా ఓడిపోయారు. ఆయనపై RSP అభ్యర్థి బాలేంద్ర షా 49,164 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక ఓవరాల్గా 165 స్థానాలకుగాను RSP 67 చోట్ల గెలిచింది. 55 సెగ్మెంట్లలో లీడింగ్లో ఉంది. మిగతా పార్టీలన్నీ సింగిల్ డిజిట్తో పోటీ పడుతున్నాయి.
News March 7, 2026
ఇకపై రైతుల అకౌంట్లకే సబ్సిడీ నిధులు: తుమ్మల

TG: వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో రైతులు కొనుగోలు చేసిన పనిముట్లకు 40% సబ్సిడీని ప్రభుత్వం కంపెనీలకు అందిస్తోంది. ఇకపై అన్నదాతల ఖాతాలకే ఆ డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. APR నెలాఖరులోగా పచ్చిరొట్ట విత్తనాలను సిద్ధం చేయాలని సూచించారు. ఖరీఫ్ కోసం ముందుగానే ఎరువులను తెప్పించాలన్నారు. ఈసారి 60.60L హెక్టార్లలో సాగయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
News March 7, 2026
రాజమండ్రి కల్తీ పాలు.. మిస్టరీ వీడింది

AP: రాజమండ్రిలో కల్తీ పాల ఘటనకు కారణాలను అధికారులు వెల్లడించారు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం <<19223408>>ఇథిలీన్ గ్లైకాల్<<>> అనే విషపూరిత కెమికల్ పాలలో కలిసినట్లు తెలిపారు. వీటిని తాగడం వల్ల కిడ్నీలు దెబ్బతిని పలువురు <<19320294>>మరణించినట్లు<<>> వివరించారు. కాగా గత నెలలో పాలను నిల్వ చేసే ఫ్రీజర్ చెడిపోవడంతో అందులోని కూలెంట్ లీకయ్యింది. పాలు చేదుగా ఉన్నాయని పలువురు ఫిర్యాదు చేసినా వ్యాపారి గణేశ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు.


