News March 17, 2024

అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేస్తాం: CM

image

TG: ఒకే వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై సీఎం రేవంత్ స్పందించారు. ‘నా పేషీలో బ్రాహ్మిణ్, ముస్లిం, దళిత్, ఓబీసీ నుంచి ఒక్కొక్కరు, ఇద్దరు రెడ్లున్నారు. నలుగురిని ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులుగా తీసుకుంటే.. అందులో ముస్లిం, దళిత్, రెడ్డి, బ్రాహ్మిణ్ ఉన్నారు. కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకంలోనూ సామాజిక న్యాయం పాటించాం’ అని అన్నారు. సోషల్ మీడియాలో విమర్శలను పట్టించుకోవద్దన్నారు.

Similar News

News September 8, 2025

నివేదా థామస్ లేటెస్ట్ ఫొటోస్ VIRAL

image

‘35 చిన్న కథ కాదు’ సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చిన మలయాళ క్యూటీ నివేదా థామస్ తాజా ఫొటోలు వైరలవుతున్నాయి. వైట్ శారీలో ఓనమ్ వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో గతంతో పోలిస్తే కాస్త బరువు తగ్గినట్లు ఉన్నారని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కాగా గద్దర్ అవార్డు వేడుకల సమయంలో నివేదా <<16710784>>బరువు<<>> పెరిగారంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

News September 8, 2025

దేశవ్యాప్తంగా అందుబాటులోకి VoNR: JIO

image

దేశం అంతటా VoNR (Voice over 5G) సేవలను JIO యాక్టివేట్ చేసింది. ఇప్పటివరకూ VoLTE ఉండగా ప్రస్తుతం 5G నెట్‌వర్క్‌పై పనిచేసే VoNR అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల నెట్‌వర్క్ వీక్‌గా ఉన్నప్పుడు 5G నుంచి 4Gకి మారడం లాంటి సమస్యలు ఉండవు. కాల్ నాణ్యత మెరుగవుతుంది. స్పష్టంగా వినిపిస్తుంది. కాల్ త్వరగా కనెక్ట్ అవుతుంది. బ్యాటరీ ఆదా అవుతుంది. ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా ఇంటర్నెట్ వేగం తగ్గదు.

News September 8, 2025

రేపు భారీ వర్షాలు: APSDMA

image

AP: దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు పార్వతీపురం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, భారీ హోర్డింగ్స్ వద్ద ఉండవద్దని హెచ్చరించింది.