News January 11, 2025

మద్యం ధరలు పెంచే ప్రసక్తే లేదు: సీఎం రేవంత్

image

TG: లిక్కర్ కంపెనీల ఎంపికలో పారదర్శకత పాటించాలని సీఎం రేవంత్ ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. కొత్త కంపెనీలు దరఖాస్తు చేసుకునేందుకు వారికి కనీసం నెలరోజుల సమయం ఇవ్వాలని సూచించారు. ‘రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల సరఫరాకు ఈజీ డూయింగ్ పాలసీ అనుసరించాలి. కొత్త కంపెనీలను అనుమతించే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లిక్కర్ కంపెనీల ఒత్తిడికి తలొగ్గి మద్యం ధరలు పెంచే ప్రసక్తే లేదు’ అని ఆయన స్పష్టం చేశారు.

Similar News

News March 22, 2026

TODAY HEADLINES

image

☛ యుద్ధాన్ని మేం ప్రారంభించలేదు.. మోదీతో ఇరాన్ అధ్యక్షుడు
☛ హార్ముజ్‌ను తెరవండి.. ఇరాన్‌కు 22 దేశాల లేఖ
☛ ఇకపై ఖర్చులు పెరుగుతాయనేది నిజం: రాహుల్
☛ రాష్ట్రాలకు అదనంగా 20% కమర్షియల్ గ్యాస్
☛ తిరుమల పవిత్రతకు భంగం కలగకుండా చర్యలు: CBN
☛ AP: ‘గురుకుల’ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు
☛ ఆగమశాస్త్రానుసారం ‘భద్రాచలం’ అభివృద్ధి: రేవంత్
☛ 6 గ్యారంటీలకు చట్టబద్ధతతో ఎన్నో లాభాలు: KTR

News March 22, 2026

ఐపీఎల్‌కు బారెడు.. టెస్టులకు చారెడు!

image

క్రేజ్‌‌ను క్యాష్ చేసుకునేందుకు BCCI ఏటా ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య పెంచుతోంది. ఈసారి పది మ్యాచ్‌లు పెంచి 84కి చేర్చింది. ఇది బాగానే ఉన్నా భారత్ లాంగ్ ఫార్మాట్ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఐపీఎల్ తర్వాత IND షెడ్యూల్‌లో 16 T20లు, 15 ODIలు ఉంటే టెస్టులు మాత్రం ఐదే ఉన్నాయి. అఫ్గాన్‌తో ఒకటి, శ్రీలంక- NZతో చెరో రెండు టెస్టులు IND ఆడనుంది. దీంతో బీసీసీఐ టెస్ట్‌లను విస్మరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

News March 22, 2026

పెరగనున్న విమానాల టికెట్ల ధరలు?

image

యుద్ధం నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి విమాన టికెట్ల ఛార్జీలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో విమాన ఇంధన(ATF) ధరలూ ఎగబాకే ఛాన్స్ ఉంది. సాధారణంగా ఏప్రిల్ 1న వీటిని సవరిస్తుంటారు. దీంతో టికెట్లపై దాని ప్రభావం ఆ రోజునే తెలుస్తుందని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ ఇటీవల అన్నారు. కాగా ఇప్పటికే కొన్ని ఎయిర్‌లైన్స్ సర్‌ఛార్జ్ పేరిట ప్రయాణికులపై భారం మోపుతున్నాయి.