News January 12, 2025
వారానికి 100 గంటలు పనిచేసేదాన్ని: ఎడెల్వీస్ CEO

వారానికి 90 గంటలు పనిచేయాలన్న SN సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలను ఎడెల్వీస్ మ్యూచువల్ఫండ్ CEO రాధికా గుప్తా తప్పుబట్టారు. తన మొదటి జాబ్లో ఏకంగా వారానికి 100 గంటలు పనిచేయడంతో మానసిక క్షోభకు గురై బాత్రూమ్లో ఏడ్చేదానినని చెప్పుకొచ్చారు. హార్డ్వర్క్ను ఉద్యోగుల పని గంటలతో పోల్చొద్దని, పనిలో నాణ్యత, ఉత్పాదకత ముఖ్యమన్నారు. ఉద్యోగి శ్రేయస్సు, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే వర్క్ కల్చర్ కావాలన్నారు.
Similar News
News January 14, 2026
BREAKING: భారత్ ఓటమి

టీమ్ ఇండియాతో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 285 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 47.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మిచెల్ సెంచరీ (131*)తో చెలరేగి తమ జట్టుకు విజయాన్ని అందించారు. యంగ్ 87 పరుగులతో రాణించారు. మూడో వన్డే జనవరి 18న ఇండోర్లో జరగనుంది.
News January 14, 2026
మిడిల్ ఈస్ట్లో టెన్షన్ టెన్షన్.. ఇరాన్ హెచ్చరికతో..

మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తమ దేశంపై అమెరికా స్ట్రైక్ చేస్తే మిడిల్ ఈస్ట్లోని US మిలిటరీ బేస్లపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. దీంతో ఖతర్లోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్ నుంచి తమ సైనిక బలగాలను అమెరికా వెనక్కి పిలిచింది. ముందు జాగ్రత్తగానే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. కాగా మిడిల్ ఈస్ట్లో USకు ఇదే అతిపెద్ద మిలిటరీ బేస్. ఇందులో 10వేలకు పైగా అమెరికా సైనికులు ఉంటారు.
News January 14, 2026
ఫోన్ల ధరలు 30% పెరిగే ఛాన్స్: నథింగ్ CEO

స్మార్ట్ ఫోన్ల ధరలు ఈ ఏడాది 30% లేదా అంతకంటే ఎక్కువే పెరగొచ్చని నథింగ్ కంపెనీ CEO కార్ల్ పై అంచనా వేశారు. ఒకవేళ ధరలు పెంచకపోతే స్పెసిఫికేషన్స్ను తగ్గించాల్సి వస్తుందన్నారు. మెమరీ, డిస్ ప్లే ధరలు కొన్నేళ్లుగా తగ్గుతూ వచ్చాయని, ఇప్పుడు మెమరీ ధరలు 3 రెట్లు పెరిగాయని చెప్పారు. AI వల్ల స్మార్ట్ ఫోన్లలో వాడే మెమరీ చిప్స్కు డిమాండ్ ఏర్పడిందని, నథింగ్ సహా ఇతర బ్రాండ్ల ఫోన్ల ధరలు పెరుగుతాయన్నారు.


