News January 12, 2025
వారానికి 100 గంటలు పనిచేసేదాన్ని: ఎడెల్వీస్ CEO

వారానికి 90 గంటలు పనిచేయాలన్న SN సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలను ఎడెల్వీస్ మ్యూచువల్ఫండ్ CEO రాధికా గుప్తా తప్పుబట్టారు. తన మొదటి జాబ్లో ఏకంగా వారానికి 100 గంటలు పనిచేయడంతో మానసిక క్షోభకు గురై బాత్రూమ్లో ఏడ్చేదానినని చెప్పుకొచ్చారు. హార్డ్వర్క్ను ఉద్యోగుల పని గంటలతో పోల్చొద్దని, పనిలో నాణ్యత, ఉత్పాదకత ముఖ్యమన్నారు. ఉద్యోగి శ్రేయస్సు, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే వర్క్ కల్చర్ కావాలన్నారు.
Similar News
News February 19, 2025
కులంలోనే కాదు.. మతంలోనూ పేదరికం ఉంది: షబ్బీర్ అలీ

TG: మైనారిటీలను BCల్లో కలిపారంటూ BJP చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. ‘వెనుకబడిన మైనార్టీలు ఇప్పటికీ BC జాబితాలో ఉన్నారు. కులంలోనే కాదు మతంలోనూ పేదరికం ఉంది. పిలిస్తే బీజేపీ ఆఫీస్కు వచ్చి ప్రజెంటేషన్ ఇస్తా. వెనుకబడిన తరగతులు ఎక్కడ ఉన్నా వెనుకబడిన తరగతులే. బీసీలపై BJPకి అంత ప్రేమ ఉంటే బీసీ కులగణన చేయించాలి’ అని డిమాండ్ చేశారు.
News February 19, 2025
నేడు ఢిల్లీకి చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఈరోజు రాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం 11.30కి జరిగే ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. ఈ మేరకు ఎన్డీయే పెద్దలు ఆయన్ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ బీజేఎల్పీ సమావేశం జరగనుంది. కాబోయే ముఖ్యమంత్రిని ఈ సమావేశంలో ఎంచుకోనున్నారు. ఎవరి పేరును ప్రకటిస్తారన్న ఆసక్తి బీజేపీ వర్గాల్లో నెలకొంది.
News February 19, 2025
పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

AP: తమ ఆదేశాలను లెక్కచేయట్లేదంటూ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులు నమోదు చేయడం, కస్టడీలో కొట్టడం తప్ప దర్యాప్తు చేయడంలేదని క్లాస్ తీసుకుంది. ఇలాంటి వైఖరిని సహించేది లేదని తేల్చిచెప్పింది. బొసా రమణ అనే వ్యక్తిపై 27 కేసులుండగా అతడి భార్య దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులో పూర్తి వివరాలెందుకు సమర్పించలేదంటూ నిలదీసింది.