News March 17, 2024

ప్రతి సోమవారం ప్రజావాణి రద్దు: కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

image

జిల్లాలో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ (కోడ్) ముగిసేంతవరకు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి కార్యక్రమ తేదీల, వివరాలను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వెల్లడించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.

Similar News

News July 5, 2024

HNK: అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ మంత్రి సమీక్షా సమావేశం

image

హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు. హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలు, తదితర అంశాలను సమావేశంలో జిల్లా కలెక్టర్ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో చర్చించారు.

News July 5, 2024

BHPL: జిల్లా జడ్పీ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

image

భూపాలపల్లి జిల్లా జడ్పీ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….జిల్లాలో పనిచేస్తున్న ఎంపీడీవోల సీనియారిటీ జాబితా అందజేయాలని జడ్పీ సీఈఓకు సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ విజయలక్ష్మి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

News July 5, 2024

KU ఎస్సై కుమారుడికి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌‌లో చోటు

image

కేయూసీ పీఎస్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న దేవేందర్‌- స్వప్న దంపతుల కుమారుడు అక్షిత్‌ 6వ తరగతి చదువుతున్నాడు. అతి పిన్న వయస్సులోనే ప్రపంచ దేశాలకు సంబంధించిన రాజధానులతో పాటు ఆ దేశ కరేన్సీలను చూడకుండా ధారళంగా చెప్పాడు. ప్రతిభను గుర్తించిన తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ గుర్తింపు పత్రాన్ని జారీ చేశారు. శుక్రవారం ఈ పత్రాన్ని వరంగల్‌ సీపీ అంబర్ కిశోర్ ఝా తన చేతుల మీదుగా అక్షిత్‌కు అందజేశారు.