News March 17, 2024
ప్రతి సోమవారం ప్రజావాణి రద్దు: కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

జిల్లాలో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ (కోడ్) ముగిసేంతవరకు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి కార్యక్రమ తేదీల, వివరాలను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వెల్లడించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.
Similar News
News April 11, 2026
పున్నెలు హత్య కేసు ఇచ్చిన భయానక సందేశం

హనుమకొండ జిల్లా పున్నెలు ఘటన ఈ సమాజానికి గంభీర హెచ్చరికగా నిలిచింది. కుమారుడు పుట్టాలనే మొండి అభిప్రాయం, లింగ వివక్ష, అక్రమ సంబంధాలు ఎంతటి దారుణాలకు దారి తీస్తాయో ఈ కేసు స్పష్టం చేసింది. లింగ నిర్ధారణ వంటి చట్టవిరుద్ధ చర్యలు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కలిసి ఒక కుటుంబాన్ని నాశనం చేశాయి. మహిళలపై వివక్షను నిర్మూలించడం, చట్టాలను కఠినంగా అమలు చేయడం, సమాజంలో అవగాహన పెంచడం అత్యవసరం. మీరేమంటారు?
News April 11, 2026
పున్నెలు హత్య కేసు ఇచ్చిన భయానక సందేశం

హనుమకొండ జిల్లా పున్నెలు ఘటన ఈ సమాజానికి గంభీర హెచ్చరికగా నిలిచింది. కుమారుడు పుట్టాలనే మొండి అభిప్రాయం, లింగ వివక్ష, అక్రమ సంబంధాలు ఎంతటి దారుణాలకు దారి తీస్తాయో ఈ కేసు స్పష్టం చేసింది. లింగ నిర్ధారణ వంటి చట్టవిరుద్ధ చర్యలు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కలిసి ఒక కుటుంబాన్ని నాశనం చేశాయి. మహిళలపై వివక్షను నిర్మూలించడం, చట్టాలను కఠినంగా అమలు చేయడం, సమాజంలో అవగాహన పెంచడం అత్యవసరం. మీరేమంటారు?
News April 10, 2026
24 గంటల్లో అరెస్ట్ చేయండి: ఎమ్మెల్యే

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం AK తండాలో యువతి మహేశ్వరి హత్య ఘటన కలకలం రేపింది. సామూహిక అత్యాచారం అనంతరం హత్య చేశారనే ఆరోపణలతో ప్రాంతంలో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కుటుంబాన్ని పరామర్శించారు. నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. చట్టం ముందు ఎవ్వరూ మినహాయింపు కాదని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


