News January 15, 2025

ఆర్మీ డే ఇవాళే ఎందుకంటే?

image

భారత సైన్యాన్ని అధికారికంగా ఏప్రిల్ 1, 1895న స్థాపించారు. స్వాతంత్ర్యం తర్వాత చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ భారతదేశానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్ మదప్ప కరియప్ప అనే కమాండర్‌కు ఇదే రోజున 1949లో బాధ్యతలు అప్పగించారు. దీనిని స్మరిస్తూ ప్రతి ఏటా JAN 15న ఆర్మీ డే నిర్వహిస్తున్నారు. ఈ రోజున సైనికుల శౌర్యాన్ని, త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ వేడుకలు చేస్తారు.

Similar News

News September 8, 2025

కుల్గాం ఎన్‌కౌంటర్.. ఇద్దరు సైనికుల వీరమరణం

image

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు. ఆపరేషన్ గడర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను అంతమొందించినట్లు అధికారులు వెల్లడించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు సంతాపం తెలిపారు. ఉగ్రవాదుల ఏరివేతకు గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు.

News September 8, 2025

‘ఆమె లేని లోకంలో నేను ఉండలేను’.. ప్రియుడి సూసైడ్

image

TG: ప్రేయసి మరణవార్తను తట్టుకోలేక ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల(D)లోని పాత కొమ్ముగూడెంలో జరిగింది. ఇంజినీరింగ్ విద్యార్థిని హితవర్షిణి ప్రేమలో విఫలమై నిన్న SECBADలో రైలు కిందపడి సూసైడ్ చేసుకుంది. ‘నా బంగారు తల్లి లేని లోకంలో బతకలేను. మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. వచ్చే జన్మలో పెళ్లి చేసుకుంటా’ అంటూ లెటర్ రాసి వినయ్ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News September 8, 2025

గాయం నుంచి కోలుకుంటున్న పంత్

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ గాయం నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్‌తో సిరీస్‌కు ఆయన అందుబాటులోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గాయం నుంచి మరింత వేగంగా కోలుకునేందుకు పంత్ వైద్య నిపుణులను సంప్రదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో క్రిస్ వోక్స్ విసిరిన బంతి పంత్ కాలికి బలంగా తగిలింది. దీంతో ఆయన విలవిల్లాడుతూ వెంటనే మైదానాన్ని వీడారు.