News January 15, 2025
చట్టం ప్రకారం నీటి కేటాయింపులు జరగాల్సిందే: CM రేవంత్

TG: రాష్ట్రానికి రావాల్సిన నీటి కేటాయింపులపై కృష్ణా ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలని అధికారులను CM రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇరిగేషన్ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. అంతర్రాష్ట్ర నదీజలాల చట్టం ప్రకారం నీటి కేటాయింపులు జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఏపీ నిర్మిస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలుపుతూ కేంద్ర జల్శక్తి శాఖ, GRMB, KRMB, AP CMకు లేఖలు రాయాలని చెప్పారు.
Similar News
News September 10, 2025
మాగంటి ఫ్యామిలీకి అండగా నిలవాలి: కేటీఆర్

TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీకి అందరూ అండగా నిలవాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఓ సర్వే ప్రకారం ఇక్కడ మనదే లీడ్ అని చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమావేశంలో మాట్లాడారు. ‘కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఆ పార్టీకి ఓటేస్తే మీ ఇల్లు మీరు కూల్చుకున్నట్లే’ అని వ్యాఖ్యానించారు. BRS అభ్యర్థిగా గోపీనాథ్ భార్య సునీత పేరు ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది.
News September 10, 2025
మహాలయ పక్షాల్లో ఏం చేయాలి?

మహాలయ పక్షము పితృదేవతలను స్మరించుకునే పవిత్ర సమయం. ఈ పదిహేను రోజులు గతించినవారి ఆత్మశాంతి కోసం తర్పణాలు, శ్రాద్ధ కర్మలు ఆచరించాలి. ఇది తరతరాల అనుబంధాన్ని, కృతజ్ఞతను చాటుకునే ఆధ్యాత్మిక విధిని సూచిస్తుంది. ఈ సమయంలో చేసే పిండ ప్రదానాలు, అన్నదానాలు పితృదేవతలకు సద్గతిని ప్రసాదిస్తాయి. మనకు వారి ఆశీర్వాదాలు లభించేలా చేస్తాయి. ఈ కర్మలు మనల్ని మన మూలాలకు మరింత దగ్గర చేస్తాయి.
News September 10, 2025
మైథాలజీ క్విజ్ – 2

1. దశరథుడి తండ్రి పేరేంటి?
2. మహాభారతంలో ‘గాంగేయుడు’ అని ఎవర్ని అంటారు?
3. ‘చిఖల్ కలో’ పండుగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు?
4. ఆశ్వయుజ మాసంలో అమావాస్య నాడు మనం ఏ పండగ జరుపుకుంటాం?
5. తుంబురుడి వీణ పేరేంటి?
6. ‘శ్వేత సౌధం’(The White Pagoda) అని ఏ ఆలయాన్ని అంటారు?
– సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.