News March 18, 2024

నేడు జగిత్యాలకు ప్రధాని మోదీ రాక

image

TG: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. జగిత్యాలలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఉదయం 11.30 గంటలకు సభలో మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని సభకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 1,600 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించనుండగా.. సభ ఏర్పాట్లను ఎంపీ అర్వింద్ పర్యవేక్షిస్తున్నారు.

Similar News

News September 30, 2024

స్కూళ్లకు కీలక ఆదేశాలు

image

AP: ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులందరికీ OCT 14లోగా APAAR(ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) కార్డులు ఇవ్వాలని విద్యాశాఖ ఆదేశించింది. దీనిపై తల్లిదండ్రుల్లోనూ అవగాహన కల్పించాలని సూచించింది. ఈ కార్డులో విద్యార్థి పేరు, బర్త్‌డే, ఫొటో, క్యూఆర్ కోడ్, 12 అంకెలతో గుర్తింపు నంబర్ ఉంటుంది. పిల్లల అకడమిక్ సమాచారం, ప్రోగ్రెస్ వివరాలన్నీ ఇందులో నిక్షిప్తమవుతాయి.

News September 30, 2024

నూతన లిక్కర్ పాలసీపై నేడో రేపో నోటిఫికేషన్

image

AP: మద్యం వ్యాపారాన్ని ప్రైవేటుకు అప్పగించేందుకు వీలుగా ‘AP రెగ్యులరేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్’ చట్టానికి ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్ జస్టిస్ నజీర్ ఆమోదించారు. న్యాయశాఖ ఇవాళ ఉదయం గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించనుంది. నూతన మద్యం పాలసీ విధివిధానాలతో నేడు సాయంత్రం లేదా రేపు ఉదయం ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులివ్వనుంది. OCT 10-11 నాటికి లైసెన్సుల ప్రక్రియ పూర్తవనుంది.

News September 30, 2024

పాకిస్థాన్ అలా చేసి ఉంటే..: రాజ్‌నాథ్ సింగ్

image

J&K ఎన్నికల ప్రచారంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ గాని భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించి ఉంటే IMFని కోరుతున్న మొత్తం కంటే ఎక్కువ ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి ఉండేవారమని తెలిపారు. భారత్‌కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని అస్త్రంగా చేసుకున్న పాకిస్థాన్ అంతర్జాతీయ వేదికలపై ఏకాకిగా మారిందని విమర్శించారు.