News March 18, 2024
నేడు జగిత్యాలకు ప్రధాని మోదీ రాక

TG: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. జగిత్యాలలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఉదయం 11.30 గంటలకు సభలో మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని సభకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 1,600 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించనుండగా.. సభ ఏర్పాట్లను ఎంపీ అర్వింద్ పర్యవేక్షిస్తున్నారు.
Similar News
News February 9, 2026
గోండ్ కటిరాతో ఎన్నో లాభాలు

గోండ్ కటిరాలో ఉండే ప్రొటీన్ మీ కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో, కణజాలాలను బాగు చేయడంలో సహాయపడుతుంది. ఇది శక్తిని కూడా అందిస్తుంది. గోండ్ కటిరా తీసుకోవడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గోండ్ కటిరా తినడం వలన చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ఇది ముఖం పై మొటిమలను పోగొట్టడంలో, జుట్టు సమస్యలకు చికిత్స చేయడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
News February 9, 2026
220 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు.. అప్లై చేశారా?

చెన్నై ఆవడిలోని హెవీ వెహికల్ ఫ్యాక్టరీ 220 Jr. టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, NAC/NTC/STC అర్హతతో పాటు పని అనుభవం గలవారు FEB 14 వరకు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://avnl.co.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News February 9, 2026
విశాఖ టు చెన్నై.. క్రూయిజ్షిప్ విహారానికి ఏర్పాట్లు

AP: ఈ ఏడాది కూడా విశాఖ నుంచి పుదుచ్చేరి మీదుగా చెన్నై వరకు లగ్జరీ క్రూయిజ్షిప్ విహారానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. జూన్ 24, జులై 1, 8, 15వ తేదీల్లో సర్వీసులు ఉంటాయి. రేట్లు, టైమింగ్స్పై విశాఖ పోర్టు అధికారులు కార్డిలియా క్రూయిజ్ ఎంవీ ఎంప్రెస్ యాజమాన్యంతో చర్చలు పూర్తిచేశారు. త్వరలోనే టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. కాగా ఈ 11 అంతస్తుల షిప్ ఇప్పటికే మూడుసార్లు విశాఖ నుంచి సేవలందించింది.


