News January 22, 2025

జనగామ: రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు 

image

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా జనగామ జిల్లాలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీ డ్రైవర్లు, ఓనర్లకు జిల్లా రవాణా అధికారి జీవి శ్రీనివాస్ గౌడ్ రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News April 19, 2026

విద్యుత్ సమస్యల పరిష్కారానికి డయల్ యువర్ సీఎండీ

image

ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ సంబంధిత సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో ప్రతి సోమవారం డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని పృథ్వీతేజ్ ఇమ్మడి నిర్వహిస్తున్నారు. విద్యుత్ వినియోగదారులు 86884 00499 నంబర్ ద్వారా విద్యుత్ సంబంధిత సమస్యలను తెలియజేయవచ్చు. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

News April 19, 2026

ఏపీ విభజన వ్యాఖ్యల వివాదం.. తేజస్వీ సూర్య ఏమన్నారంటే?

image

తెలంగాణను ఉద్దేశించి లోక్‌సభలో తాను చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడంపై BJP MP తేజస్వీ సూర్య స్పందించారు. ‘కాంగ్రెస్ నిరక్షరాస్యుల పార్టీ. నేనేం మాట్లాడానో ఆ పార్టీ నేతలు మళ్లీ వినండి. ఆ సింపుల్ మాటలను వీలైతే అర్థం చేసుకోండి. INC లీడర్లు ఉద్దేశపూర్వకంగా, అజ్ఞానంతో నిరసన తెలుపుతున్నారు’ అని మీడియాతో వ్యాఖ్యానించారు. ఉమ్మడి APని IND, PAK తరహాలో విభజించారని తేజస్వీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

News April 19, 2026

నిర్మల్: 23న బడుల్లో తల్లిదండ్రుల సమావేశం

image

నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 23న తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం) నిర్వహించాలని డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ భేటీ జరుగుతుంది. విద్యార్థుల విద్యా పురోగతి, పరీక్షా ఫలితాలపై చర్చించి ప్రగతి పత్రాలను అందజేస్తారు. వేసవి జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తామని, తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాలని జిల్లా విద్యాశాఖ కోరింది.