News January 24, 2025

పులి దాడిలో టీమ్ ఇండియా క్రికెటర్ బంధువు మృతి

image

కేరళలోని వయనాడ్‌లో పెద్ద పులి దాడిలో టీమ్ ఇండియా మహిళా క్రికెటర్ మిన్ను మణి బంధువు రాధ (45) ప్రాణాలు కోల్పోయారు. కాఫీ తోటలో పని చేస్తుండగా ఆమెపై పులి ఒక్కసారిగా దాడి చేసింది. మృతదేహంలో కొంత భాగం తినేసి వెళ్లిపోయింది. ఈ ఘటనపై కేరళలో ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. క్రూరమృగాల దాడిలో పదేళ్లలో 8 మంది మృతి చెందారని, ఇంకెంతమంది బలవ్వాలని ప్రశ్నిస్తున్నారు.

Similar News

News November 11, 2025

ఏపీలో నేడు..

image

▶ గుంటూరులో జరుగుతున్న వాటర్ షెడ్ మహోత్సవ్‌లో పాల్గొననున్న కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. అనంతరం CM చంద్రబాబుతో భేటీ
▶ అమరావతిలో దసపల్లా 4 స్టార్ హోటల్ నిర్మాణానికి భూమిపూజ
▶ శ్రీకాకుళంలో ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్న సిక్కోలు పుస్తక మహోత్సవం, 10 రోజులు కొనసాగింపు

News November 11, 2025

2700 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తులు

image

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) 2,700 అప్రెంటిస్ పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ ఉత్తీర్ణులైనవారు DEC 1వరకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం అప్రెంటిస్‌లలో TGలో 154, APలో 38 ఉన్నాయి. NATS లేదా NAPS పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్‌లైన్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News November 11, 2025

కర్రపెండలంలో జింక్ లోప లక్షణాలు – నివారణ

image

కర్రపెండలంలో మొక్కలో జింక్ లోపం వల్ల ఆకులు సన్నగా, పసుపుగా మారి పైకి వంకరగా ఉంటాయి. పెరుగుతున్న లేత మొక్క భాగంపై ప్రభావం ఎక్కువగా ఉండి, పెరుగుదల తగ్గుతుంది. లేత ఆకులలో ఈనెల ముఖ్య భాగం పసుపు రంగులోకి మారుతుంది. లోప నివారణకు 5KGల జింక్ సల్ఫేట్ భూమిలో వేసి కప్పాలి. 1-2% జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని 3-4 సార్లు పిచికారీ చేయాలి. ముచ్చెలను 2-4% జింక్ సల్ఫేట్ ద్రావణంలో 15 నిమిషాలు ముంచిన తర్వాత నాటుకోవాలి.