News March 18, 2024

బాపట్ల: పది పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

image

పది పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. బందోబస్తు నిర్వహణకు 216 మంది పోలీసు సిబ్బందిని నియమించారు. పరీక్ష సమయాలకు అనుగుణంగా విద్యార్థులు కేంద్రాలకు వచ్చి వెళ్లటానికి ఆర్టీసీ బస్సులు నడపాలని అధికారులను ఆదేశించారు. 216 మంది ఏఎన్ఎంలతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల సమయంలో జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News February 5, 2026

గుంటూరులో చోరీ.. రూ.3లక్షల అపహరణ

image

గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బారాఇమాం పంజా సెంటర్‌లో చోరీఘటనపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు వెల్లడించారు. బారాఇమాం పంజా సెంటర్‌కి చెందిన పగడాల రాజేశ్వరి ఇంట్లో చోరీ జరిగినట్లు ఫిర్యాదు చేసింది. ఇంట్లోని రూ.3 లక్షల నగదు అపహరణకు గురైందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యప్తు చేపట్టారు.

News February 5, 2026

సౌరశక్తితో గుంటూరులో 772 గిరిజన గృహాలకు వెలుగు

image

విద్యుత్‌ లేని కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాల ద్వారా సరఫరా అందిస్తుందని లోక్‌సభలో వెల్లడైంది. RDSS, PM-JANMAN పథకాల కింద రాష్ట్రంలో వేలాది ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేశారు. కాగా గుంటూరు జిల్లాలో PM-JANMAN కింద 772 PVTG కుటుంబాలకు విద్యుత్‌ కనెక్షన్లు మంజూరయ్యాయి. సౌర వీధి దీపాలు, ఆఫ్‌గ్రిడ్‌ సౌర వ్యవస్థల ఏర్పాటుతో గిరిజన ప్రాంతాలకు లబ్ధి చేకూరిందని కేంద్ర మంత్రి వెల్లడించారు.

News February 5, 2026

సౌరశక్తితో గుంటూరులో 772 గిరిజన గృహాలకు వెలుగు

image

విద్యుత్‌ లేని కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాల ద్వారా సరఫరా అందిస్తుందని లోక్‌సభలో వెల్లడైంది. RDSS, PM-JANMAN పథకాల కింద రాష్ట్రంలో వేలాది ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేశారు. కాగా గుంటూరు జిల్లాలో PM-JANMAN కింద 772 PVTG కుటుంబాలకు విద్యుత్‌ కనెక్షన్లు మంజూరయ్యాయి. సౌర వీధి దీపాలు, ఆఫ్‌గ్రిడ్‌ సౌర వ్యవస్థల ఏర్పాటుతో గిరిజన ప్రాంతాలకు లబ్ధి చేకూరిందని కేంద్ర మంత్రి వెల్లడించారు.