News March 18, 2024

బాపట్ల: పది పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

image

పది పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. బందోబస్తు నిర్వహణకు 216 మంది పోలీసు సిబ్బందిని నియమించారు. పరీక్ష సమయాలకు అనుగుణంగా విద్యార్థులు కేంద్రాలకు వచ్చి వెళ్లటానికి ఆర్టీసీ బస్సులు నడపాలని అధికారులను ఆదేశించారు. 216 మంది ఏఎన్ఎంలతో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల సమయంలో జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News March 13, 2026

కలెక్టర్ల సదస్సులో గుంటూరు కలెక్టర్, ఎస్పీ

image

అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్సులో CM చంద్రబాబు జిల్లాల కలెక్టర్, SPలకు కీలక సూచనలు చేశారు. ప్రజల ప్రాణాల కంటే ముఖ్యమైనది ఏదీ లేదని పేర్కొంటూ రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బ్లాక్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మహిళలపై నేరాల విషయంలో జీరో టాలరెన్స్ పాటించాలని స్పష్టం చేశారు.

News March 12, 2026

GOOD NEWS గుంటూరు: రేపే నగదు జమ

image

అన్నదాత సుఖీభవ-PM కిసాన్ పథకం మూడో విడత నిధులు శుక్రవారం గుంటూరు జిల్లా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. జిల్లాలోని 1,06,329 మంది రైతులకు రూ.59.28 కోట్ల నిధులు ఖాతాల్లో జమ చేసేందుకు గురువారం అధికారులు చర్యలు తీసుకున్నారు. వీటిలో రూ.42.53 కోట్లు అన్నదాత సుఖీభవ కాగా, రూ.16.75 కోట్లు PM కిసాన్ నిధులుగా చెప్పారు. ఈ విడతలో రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.6,000ల చొప్పున జమ అవుతాయన్నారు.

News March 12, 2026

గుంటూరులో LPG సిలిండర్ల స్వాధీనం

image

విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్మెంట్ అధికారులు గురువారం గుంటూరులో దాడులు నిర్వహించారు. వాణిజ్య అవసరాలకు అక్రమంగా ఉపయోగిస్తున్న గృహ వినియోగ LPG సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. స్వీట్ షాపులు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో తనిఖీలు చేసి మొత్తం 26 సిలిండర్లు సీజ్ చేశారు. ఈ ఘటనపై ఎస్సెంటీల కమోడిటీస్ యాక్ట్, 1955 సెక్షన్ 6-A కింద 6 కేసులు నమోదు చేసి సంబంధిత అధికారులకు నివేదిక అందించారు.