News March 18, 2024
MBNR ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓటర్లు 1,439

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఓటర్ల లెక్క తేలింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 644 మంది పురుషులు, 795 మంది స్త్రీలు ఉన్నారు. 2021 ఓటర్ల జాబితా ఆధారంగా అభ్యంతరాల స్వీకరణ, మార్పుల తర్వాత ఎన్నికల అధికారులు ఓటర్ల తుది జాబితా ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 10 పోలింగ్ కేంద్రాల ద్వారా వీరంతా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
Similar News
News February 5, 2026
MBNR: బాలానగర్లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో బాలానగర్ మండల కేంద్రంలో 14.7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. రాజాపూర్ 15.0, గండీడ్ మండలం సల్కర్ పేట 15.2, మిడ్జిల్ మండలం దోనూరు 15.4, జడ్చర్ల 15.5, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 15.6, చిన్నచింతకుంట మండలం వడ్డేమాన్ లో 16.0, మిడ్జిల్ 16.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది.
News February 4, 2026
ఎఫ్ఎల్ఎస్ కార్యక్రమ అమలుపై క్షేత్రస్థాయి పరిశీలన: డీఈఓ

మహబూబ్నగర్ జిల్లా రాంనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎఫ్ఎల్ఎస్ కార్యక్రమ అమలు తీరును డీఈఓ ప్రవీణ్ కుమార్ బుధవారం పరిశీలించారు. 3వ తరగతి విద్యార్థుల చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలు, మాక్ టెస్ట్ ఫలితాలు, యాక్షన్ ప్లాన్ అమలును సమీక్షించి, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక సాధన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
News February 4, 2026
పాలమూరు అభివృద్ధికి రూ.300 కోట్లు మంజూరు: డీకే అరుణ

మహబూబ్నగర్ మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.300 కోట్లు నిధులు మంజూరు చేసిందని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. బుధవారం ఎంవీఎస్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సమ్మేళనం సభలో ఆమె మాట్లాడారు.. విమానాశ్రయాలకు దీటుగా అన్ని జిల్లాలలోని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు.


