News March 18, 2024

మోదీతోనే భారత్ సురక్షితం: అర్వింద్

image

ప్రధాని నరేంద్ర మోదీతోనే భారత్ సురక్షితంగా ఉంటుందని, నరేంద్ర మోదీని మూడవసారి ప్రధానిగా గెలిపించాలని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జగిత్యాలలో సోమవారం విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. సైనికుడు అభినందన్ ను పాకిస్థాన్ చెర నుండి విడిపించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ దన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బిజెపి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Similar News

News January 13, 2026

NZB: మున్సిపోల్.. మహిళా ఓటర్లే అధికం

image

మున్సిపల్ ఎన్నికల తుది ఓటరు జాబితాను అధికారులు విడుదల చేశారు. NZB కార్పొరేషన్‌లో మొత్తం ఓటర్లు 3,48,051 మంది ఉండగా.. మహిళలు 1,80,546, పురుషులు 1,67,461,
బోధన్‌లో మొత్తం ఓటర్లు 69,417 మంది కాగా మహిళలు 35,720, పురుషులు 33,696,
భీమ్‌గల్‌లో మొత్తం 14,045 మంది ఓటర్లు ఉండగా మహిళలు 7,429, పురుషులు 6,616,
ఆర్మూర్‌లో మొత్తం ఓటర్లు 63,972 మంది ఉండగా మహిళలు 33,322, పురుషులు 30,648, ఇతరులు ఇద్దరు ఉన్నారు.

News January 13, 2026

నిజామాబాద్ కార్పొరేషన్‌పై కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్..!

image

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌పై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టిసారించింది. మహేశ్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా, టీపీసీసీ చీఫ్‌గా ఉండటంతో నిజామాబాద్ నగరపాలక సంస్థపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఉంది. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నందున టార్గెట్ మిస్ కావొద్దని భావిస్తోంది. అవసరమైతే ఎంఐఎంతో దోస్తీతో మేయర్ సీటు కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు కనిపిస్తోంది.

News January 13, 2026

పొలిటికల్ హీట్.. నిజామాబాద్‌లో కాంగ్రెస్ Vs బీజేపీ

image

మున్సిపల్ ఎన్నికల వేళ నిజామాబాద్ పాలిటిక్స్ హీటెక్కాయి. ఎన్నికలు రాగానే హిందూత్వ అని బీజేపీ హడావుడి చేస్తుందని రాముడు బీజేపీలో సభ్యత్వం తీసుకున్నాడా అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. రాముని జోలికి వస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా కౌంటర్ ఇచ్చారు. రాముని అంశం నేపథ్యంలో నిజామాబాద్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారి మాటల యుద్ధం పెరిగింది.