News March 18, 2024

ఆ ఇద్దరిని భారీ మెజార్టీతో గెలిపించాలి: జగిత్యాలలో మోదీ

image

కరీంనగర్, పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థులు బండిసంజయ్, గోమాస శ్రీనివాస్‌ను భారీ మోజార్టీతో గెలిపించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. జగిత్యాల విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల పండగ మెుదలైందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించిబోతున్నారని అన్నారు. 400 సీట్లు దాటాలి- బీజేపీకి ఓటేయాలని కోరారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Similar News

News December 3, 2025

కరీంనగర్: యువకుడిపై పోలీసుల థర్డ్ డిగ్రీ..?

image

యువకుడిని రక్తం వచ్చేలా పోలీసులు విచక్షణారహితంగా కొట్టిన ఘటన కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 24 గంటలపాటు పోలీసులు అధీనంలో ఉంచుకొని రాత్రి 9:30కు జైలుకు తరలించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘నా కొడుకు చేసిన నేరమేంటి? ఇంతగా ఎందుకు హింసిస్తున్నారు’ అంటూ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. దీనిపై CP జోక్యం చేసుకొని వాస్తవాలు వెల్లడించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

News December 3, 2025

గన్నేరువరం: ‘క్రీడల్లోనూ బాలికలు ముందుండాలి’

image

బాలికలు చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుండి, అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పేర్కొన్నారు. స్నేహిత అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం తిమ్మాపూర్ కేజీబీవీ, గన్నేరువరం పాఠశాలలను ఆమె సందర్శించారు. అన్ని రంగాల్లోనూ ప్రతిభ చూపాలని బాలికలకు సూచించారు. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే హెల్ప్‌లైన్ నెంబర్లకు కాల్ చేయాలని కోరారు.

News December 3, 2025

KNR: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ

image

డిసెంబర్ 14న జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నేపథ్యంలో తిమ్మాపూర్, మానకొండూర్, శంకరపట్నం, చిగురుమామిడి, గన్నేరువరం మండలాలలో పోలింగ్ కేంద్రాన్ని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం సందర్శించారు. ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సీపీ విజ్ఞప్తి చేశారు.