News March 18, 2024
ఆ ఇద్దరిని భారీ మెజార్టీతో గెలిపించాలి: జగిత్యాలలో మోదీ

కరీంనగర్, పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థులు బండిసంజయ్, గోమాస శ్రీనివాస్ను భారీ మోజార్టీతో గెలిపించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. జగిత్యాల విజయసంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల పండగ మెుదలైందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు సరికొత్త చరిత్రను లిఖించిబోతున్నారని అన్నారు. 400 సీట్లు దాటాలి- బీజేపీకి ఓటేయాలని కోరారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
Similar News
News February 12, 2025
కరీంనగర్: బీసీ స్టడీ సర్కిల్లో 12 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్

బీసీ స్టడీ సర్కిల్లో RRB, SSC, BANKING ఉచిత శిక్షణ కోసం 539 మంది దరఖాస్తు చేసుకున్నారని KNR బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ మంగళవారం తెలిపారు. వీరిలో ఇంటర్, డిగ్రీలో మెరిట్ ఆధారంగా 100 మందిని సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. 12 నుంచి 14వ వరకు స్టడీ సర్కిల్లో సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకోవాలన్నారు. 15 నుంచి తరగతులు ప్రారంభమవుతుందని చెప్పారు. SHARE IT..
News February 12, 2025
KNR: కెనాల్ కాలువలో ఈతకు వెళ్లి ఒకరు మృతి, మరొకరు గల్లంత్తు

హుజూరాబాద్ మండలం పోతిరెడ్డి పేట గ్రామంలో విషాదం నెలకొంది. ఎస్సారెస్పీ కెనాల్ కాలువలో ఈతకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గ్రామస్థుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఒకరి మృతదేహం లభించింది. పోలీసులు గజఈత గాళ్ల సాయంతో మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 11, 2025
కరీంనగర్: చింతచెట్టు పైనుంచి పడి రైతు మృతి

జిల్లాలోని చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన రైతు చెంచల సంపత్ (35) మంగళవారం చింతచెట్టు పైనుంచి పడి మృతి చెందినట్లుగా గ్రామస్థులు తెలిపారు. మృతుడు సంపత్కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల గ్రామస్థులు, బంధువులు విచారం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.