News March 18, 2024
పోలీసుల తీరుపై అనుమానాలున్నాయి: నాదెండ్ల

AP: బొప్పూడిలో నిన్న జరిగిన ప్రజాగళం సభలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అనుమానాలున్నాయని జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘దేశ ప్రధాని హాజరైన ప్రజాగళం సభలో తీవ్ర భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. కలెక్టర్, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పేర్లు, ఫొటోలు లేకుండానే ఇష్టారీతిన పాస్లు జారీ చేశారు. దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. అధికారుల తీరుపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం’ అని చెప్పారు.
Similar News
News October 27, 2025
భారత్తో టెస్ట్ సిరీస్.. SA జట్టు ప్రకటన

వచ్చే నెలలో భారత్తో జరగనున్న రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్కు 15 మంది కూడిన జట్టును SA ప్రకటించింది. కెప్టెన్గా టెంబా బవుమా వ్యవహరించనున్నారు. మార్క్రమ్, బాష్, బ్రెవిస్, టోనీ, రికెల్టన్, స్టబ్స్, వెరైన్, హమ్జా, హార్మర్, కేశవ్ మహరాజ్, ముత్తుస్వామి, ముల్డర్, జాన్సన్, రబాడ ఎంపికయ్యారు. నవంబర్ 14న తొలి టెస్టు కోల్కతాలో, రెండోది 22న గువాహటిలో జరుగుతాయి.
News October 27, 2025
పత్తిలో తేమ శాతం పెరిగితే మద్దతు ధర కష్టం: మంత్రి తుమ్మల

TG: పత్తి రైతులకు గరిష్ఠ మద్దతు ధర అందించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పత్తి అమ్మకాల విషయంలో రైతులు CCI ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యత, తేమను దృష్టిలో పెట్టుకోవాలని మంత్రి సూచించారు. పత్తిలో తేమ 12 శాతానికి మించకుండా చూసుకోవాలని.. 12 శాతానికి మించి తేమ ఉంటే కనీస మద్దతు ధర పొందడం కష్టమన్నారు. దీనికి అనుగుణంగా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News October 27, 2025
కోర్టు విచారణలు AIతో చకచకా

కోర్టుల్లో లక్షల కేసులు ఏళ్లపాటు పెండింగ్లో ఉంటున్నాయి. ఇందుకు అనేక కారణాల్లో సిబ్బంది, వనరుల కొరత ఒకటి. దీనికి AI చక్కటి పరిష్కారం చూపుతోంది. ఇప్పటికే దేశంలోని 4వేల కోర్టులు AIని అడాప్ట్ చేసుకొని న్యాయప్రక్రియను స్పీడప్ చేస్తున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు లాయర్లు రూపొందించిన ‘అదాలత్ ఏఐ’ టూల్ కోర్టు రూమ్ రూపాన్ని మార్చేస్తోంది. స్టెనో, టైపిస్టులతో పనిలేకుండా రియల్ టైమ్లో ప్రొసీడింగ్స్ ఇస్తోంది.


