News March 18, 2024
MLG: ఎండిన వరి పొలానికి నిప్పు పెట్టిన రైతు

మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామానికి చెందిన రైతు మల్లెబోయిన సైదులు ఐదెకరాల్లో వరి సాగు చేశాడు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో ములకలకాల్వ మేజర్ కాల్వ కింద బోరు నీటి ఆధారంతో సాగు చేయగా పంట పొట్ట దశకు వచ్చే వరకు నీరు పారింది. తాజాగా బోర్లలో నీరు లేకపోవడంతో పొలం పూర్తిగా ఎండిపోయింది. దీంతో ఎండిన పంటకు నిప్పు పెట్టాడు. ఐదెకరాల్లో సాగుకు రూ.1.25 లక్షల పెట్టుబడి పెట్టినట్టు వాపోయాడు.
Similar News
News January 9, 2026
నార్కట్పల్లి: చెరువుగట్టు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష

ప్రముఖ పుణ్యక్షేత్రం చెరువుగట్టులో జనవరి 23 నుంచి 30 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులు, ప్రజాప్రతినిధులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొని ఏర్పాట్లపై చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
News January 9, 2026
‘చెరువుగట్టు’ అభివృద్ధికి రూ.100 కోట్లతో మాస్టర్ ప్లాన్

చెరువుగట్టు అభివృద్ధికి రూ.100 కోట్లతో మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేశామని, వచ్చే నెలలో సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. ఈ నెల 23 నుంచి 30 వరకు నార్కట్పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి బ్రహోత్సవాలు జరగనున్నందున శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎంపీ చామల, TDDCF ఛైర్మెన్ గుత్తా అమిత్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
News January 9, 2026
కల్తీ ఆహారం అమ్మితే కఠిన చర్యలు: కలెక్టర్

ప్రజలకు సురక్షిత ఆహారం అందించేందుకు హోటళ్లు, దాబాలపై విస్తృత తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. స్కూళ్లు, హాస్టళ్లు, అంగన్వాడీల నుంచి ఆహార శాంపిళ్లు సేకరించి పరీక్షించాలని సూచించారు. కల్తీకి పాల్పడే వారిపై కేసులు నమోదు చేయాలని, ప్రతి వ్యాపారి తప్పనిసరిగా FSSAI లైసెన్స్ పొందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ఆయన పేర్కొన్నారు.


