News January 28, 2025
కడియం అంతుచూసేవరకూ నిద్రపోను: తాటికొండ రాజయ్య

TG: MLA కడియం శ్రీహరిపై BRS మాజీ మంత్రి తాటికొండ రాజయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘కడియం అంతు చూసేవరకూ నేను నిద్రపోను. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఏ అభివృద్ధీ లేదు. అవకాశవాదైన కడియం పప్పులు కాంగ్రెస్లో ఉడకవు. ఆ పార్టీ మంత్రులు సొంత దుకాణాలు తెరుచుకున్నారు. భట్టి విక్రమార్క భార్య సహా ఆ పార్టీ క్యాబినెట్ రాష్ట్రాన్ని దోచుకుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి అవినీతిమయం’ అని ఆరోపించారు.
Similar News
News March 14, 2025
సూపర్ ఐడియా కదా..!

AP: రోడ్డు ప్రమాదాల నివారణకు పల్నాడు జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎస్పీ ఆదేశాలతో ‘ఫేస్ వాష్ అండ్ గో’ ప్రోగ్రామ్ చేపట్టారు. అర్ధరాత్రి తర్వాత వాహనాలను ఆపి డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగిస్తున్నారు. నిద్రమత్తు వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ కార్యక్రమం ద్వారా ప్రమాదాలు తగ్గుతాయని పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ చేపడితే ఎంత బాగుంటుందో కదా!
News March 14, 2025
IPL-2025లో కెప్టెన్లు

*చెన్నై- రుతురాజ్ గైక్వాడ్
*ఆర్సీబీ- రజత్ పాటీదార్
*పంజాబ్- శ్రేయస్ అయ్యర్
*ముంబై- హార్దిక్ పాండ్య
*లక్నో- రిషభ్ పంత్
*గుజరాత్- గిల్
*రాజస్థాన్- సంజూ శాంసన్
*కేకేఆర్- అజింక్యా రహానే *SRH- కమిన్స్
*ఢిల్లీ- అక్షర్ పటేల్
News March 14, 2025
వచ్చే నెల 15న అమరావతికి ప్రధాని మోదీ

AP: ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారైంది. రాజధాని పున:ప్రారంభ పనులకు ఏప్రిల్ 15న ఆయన హాజరుకానున్నారు. రూ.లక్ష కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున రాజధాని పనులు ప్రారంభించి మూడేళ్లలో ముగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.