News January 30, 2025
టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్

TG: ప్రభుత్వ స్కూళ్లలో స్పెషల్ క్లాసులకు హాజరయ్యే టెన్త్ విద్యార్థులకు ఈవెనింగ్ స్నాక్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20వ తేదీ వరకు దీనిని అమలు చేయనుంది. ఉడకబెట్టిన పెసర్లు, బొబ్బర్లు, పల్లి పట్టీ, మిల్లెట్ బిస్కెట్లు, ఆనియన్ పకోడీ, శనగలు అందించాలని ఆదేశించింది. ఒక్కో స్టూడెంట్కు రోజుకు రూ.15 చొప్పున ఖర్చు చేయనుంది. MAR 21 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.
Similar News
News March 15, 2025
పవన్ స్పీచ్కు మంత్రముగ్ధుడినయ్యా: చిరంజీవి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జయకేతనం సభలో ప్రసంగానికి మంత్రముగ్ధుడినయ్యానని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. సభకు వచ్చిన జనసంద్రంలాగే తన మనసు ఉప్పొంగిందని ట్వీట్ చేశారు. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడిందన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తితో పవన్ జైత్రయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని మెగాస్టార్ ఆశీర్వదించారు.
News March 15, 2025
ఇతర మతాలవారిని తిట్టగలరా?: పవన్ కళ్యాణ్

AP: తనను సనాతన ధర్మం రక్షకుడని ఓ ఆంగ్ల జర్నలిస్టు ఎద్దేవా చేశారంటూ Dy.CM పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ‘మా రాముడి విగ్రహం తల నరికేస్తే మా మనోభావాలు గాయపడకూడదా? నోరు మూసుకుని కూర్చోవాలా? మీరు అల్లానో, జీసస్నో, మేరీమాతనో అవమానించి బతకగలరా? కానీ లక్ష్మీ దేవిని, సరస్వతి దేవిని అవమానిస్తారు. రథాల్ని తగులబెట్టేస్తారు. తప్పును తప్పని చెబితే మతోన్మాదమా?’ అని ప్రశ్నించారు.
News March 15, 2025
పవన్ ప్రసంగంపై అంబటి సెటైర్

AP: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగంపై వైసీపీ నేత అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘జయకేతనంలో ఏమి చెప్పాలనుకున్నాడో ఏమి చెప్పాడో పాపం పవన్ కళ్యాణ్’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.