News January 30, 2025

జియో యూజర్లకు షాక్

image

జియో తమ యూజర్లకు షాకిచ్చింది. ఎలాంటి సమాచారం లేకుండా రూ.189, రూ.479 ప్రీపెయిడ్ ప్లాన్లను తొలగించింది. మొబైల్ డేటా తక్కువగా వాడేవారు ఈ రీఛార్జ్ ప్లాన్లను ఎక్కువగా ఉపయోగిస్తారు. రూ.189కి 28 రోజుల వ్యాలిడిటీతో 2జీబీ డేటా+అపరిమిత కాల్స్, రూ.479కి 84 రోజుల వ్యాలిడిటీతో 6GB డేటా+అపరిమిత కాల్స్ ఉండేవి. సమాచారం లేకుండా ప్లాన్లు తొలగించడంపై పలువురు వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 22, 2025

గ్రూప్-2 ఆందోళనల వెనుక కోచింగ్ సెంటర్లు.. APPSC సంచలన ఆరోపణ

image

గ్రూప్-2 నిర్వహణపై ప్రభుత్వం రాసిన లేఖకు <<15547592>>APPSC<<>> సమాధానం ఇచ్చింది. ‘మెయిన్స్‌కు క్వాలిఫై కాని కొందరు వాయిదా కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ రద్దు చేస్తే మరోసారి పరీక్ష రాసే ఛాన్స్ పొందాలి అనుకుంటున్నారు. అభ్యర్థుల ఆందోళనల వెనుక కోచింగ్ సెంటర్లూ ఉన్నాయి. రోస్టర్ పాయింట్ల విషయాన్ని నోటిఫికేషన్లో చెప్పలేదు. పరీక్ష సకాలంలో జరగకపోతే నిజమైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది’ అని పేర్కొంది.

News February 22, 2025

కర్ణాటకకు బస్ సర్వీసులు నిలిపేసిన మహారాష్ట్ర

image

సరిహద్దు వివాదం నేపథ్యంలో కర్ణాటకకు బస్సు సర్వీసులు నిలిపేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రకటించింది. కర్ణాటకలోని బెళగావిలో MSRTCపై KRV (కన్నడ రక్షక వేదిక) ప్రతినిధులు దాడి చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి బస్సులను నడపడం మంచిది కాదని పోలీసులు హెచ్చరించడంతో నిలిపేసింది. పోలీసుల క్లియరెన్స్ వచ్చిన తర్వాత బస్సు సర్వీసులను అధికారులు పునరుద్ధరించనున్నారు.

News February 22, 2025

IML T20: నిరాశపర్చిన సచిన్.. స్కోర్ ఎంతంటే?

image

ముంబైలో జరుగుతోన్న ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20-2025లో సచిన్ టెండూల్కర్ నిరాశ పరిచారు. శ్రీలంక మాస్టర్స్ జట్టుపై 8 బంతుల్లో 10 రన్స్ చేసి ఔటయ్యారు. అంబటి రాయుడు 5, గుర్‌కీరత్ సింగ్ మాన్ 44, స్టువర్ట్ బిన్నీ 68, యువరాజ్ 31*, యూసఫ్ పఠాన్ 56* రన్స్ చేశారు. ఇండియా మాస్టర్స్ 20 ఓవర్లలో 222/4 రన్స్ చేసింది.

error: Content is protected !!