News January 31, 2025
U-19 TWC: ఫైనల్ చేరిన సౌతాఫ్రికా

అండర్-19 ఉమెన్స్ T20 WCలో ఆస్ట్రేలియాకు సౌతాఫ్రికా షాక్ ఇచ్చింది. సెమీస్లో 5 వికెట్లతో గెలిచి తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్కు దిగిన AUSను ఆ జట్టు 105 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం 18.1 ఓవర్లలో టార్గెట్ను ఛేజ్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న మరో సెమీస్లో IND, ENG తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్కు దిగిన ENG 14 ఓవర్లలో 86/4 చేసింది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్లో SAను ఢీకొంటుంది.
Similar News
News February 28, 2025
పెళ్లిళ్లలో ప్రీ వెడ్డింగ్ షూట్, డీజే బంద్

TG: ప్రీ వెడ్డింగ్ షూట్, చెవులు పగిలేలా డీజే డాన్సులు పెళ్లిళ్లలో కామన్ అయిపోయాయి. అయితే ఆదిలాబాద్ జిల్లాలోని ఓ తండావాసులు సంప్రదాయాన్ని కాపాడుకునేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. శివరాత్రి సందర్భంగా ఉట్నూర్ మం. శ్యాం నాయక్ తండా వాసులందరూ సమావేశమై.. ప్రీ వెడ్డింగ్ షూట్, డీజే, హల్దీ వంటి కార్యక్రమాలను నిషేధిస్తున్నామన్నారు. సంప్రదాయ పద్ధతిలోనే పెళ్లి చేసుకుంటామని స్పష్టం చేశారు. దీనిపై మీ కామెంట్?
News February 28, 2025
రాష్ట్రంలో 100 కొత్త పోలీస్ స్టేషన్లు?

TG: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 100 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ట్రాఫిక్ ఠాణాలతోపాటు మహిళా పీఎస్లు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి ఏర్పాటుకు సర్కార్ ఆమోదం తెలపనుంది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 844 పీఎస్లు ఉన్నాయి.
News February 28, 2025
మార్చి 5, 6 తేదీల్లో కెరీర్ ఫెయిర్

AP: రాష్ట్ర ప్రభుత్వం, నాస్కామ్ సంయుక్తంగా విశాఖలోని గీతం వర్సిటీలో MAR 5, 6 తేదీల్లో కెరీర్ ఫెయిర్ నిర్వహించనున్నాయి. ఇందులో IT, ITES రంగానికి చెందిన 49 కంపెనీల్లో యువతీయువకులకు 10వేల ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఈ మేరకు మంత్రి లోకేశ్ పోస్టర్ను ఆవిష్కరించారు. 2024, 2025లో(Tech, Arts, Science, ITI, Polytechnics & Diploma) ఉత్తీర్ణులైన వారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.