News February 1, 2025

నేటి నుంచి రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ ధరలు

image

AP: నేటి నుంచి రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. దీంతో కొత్త ఛార్జీలు తప్పించుకునేందుకు నిన్న రాష్ట్రవ్యాప్తంగా 14250 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. రోజుకు 70 నుంచి 80 రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో దాదాపు 170 వరకు జరిగాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1,184 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే రిజిస్ట్రేషన్ల ద్వారా సర్కార్‌కు ఏకంగా రూ.107 కోట్ల ఆదాయం వచ్చింది.

Similar News

News January 20, 2026

JAN 26 తర్వాత సాదా బైనామాలపై కొత్త రూల్స్!

image

TG: LRSలో పెండింగ్‌లో ఉన్న దాదాపు 9 L సాదా బైనామా అప్లికేషన్లను పరిష్కరించడానికి GOVT కొత్త రూల్స్ సిద్ధం చేస్తోంది. భూ భారతిలో సాంకేతిక సమస్యలు, దరఖాస్తుదారులు, భూ యజమానుల మధ్య వివాదాలతో వీటిని రూపొందిస్తోంది. అఫిడవిట్ల విధానాన్నీ మార్చనుంది. ఇవి JAN26 నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా దరఖాస్తుదారులకు హక్కులు కల్పిస్తే అధికారులపై కోర్టులకు వెళ్తామని యజమానులు హెచ్చరించడంతో తర్జనభర్జన పడుతున్నారు.

News January 20, 2026

బంగారం ఆల్ టైమ్ హై.. 10 గ్రా. రూ.1.52 లక్షలు

image

పసిడి పరుగులు ఆగడం లేదు. ఇవాళ మరోసారి పెరిగి ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రిటైల్ ధర ఏకంగా రూ.1,52,000 (3 శాతం జీఎస్టీతో కలిపి) దాటింది. సిల్వర్ కూడా రిటైల్ ధర కిలో రూ.3,39,900 (3% GSTతో కలిపి) పైనే పలుకుతోంది.

News January 20, 2026

రిపబ్లిక్ వేడుకలకు సీఎం రేవంత్ దూరం

image

TG: CM రేవంత్ రెడ్డి రిపబ్లిక్ వేడుకలకు హాజరు కావడం లేదు. JAN 25 నుంచి 30 వరకు USలోని హార్వర్డ్ వర్సిటీలో లీడర్‌షిప్ శిక్షణ తరగతులకు ఆయన హాజరవుతారు. JAN 23న దావోస్ పర్యటన ముగిసిన వెంటనే, ఆయన అమెరికా వెళ్లి కొంతమంది పారిశ్రామికవేత్తలను కలుస్తారు. తర్వాత యూనివర్సిటీలో తరగతులకు హాజరవుతారు. గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్యమంత్రి లేకుండానే ప్రసంగిస్తారు.