News February 1, 2025

నేతల మధ్య అంతరాలు లేకుండా చూడాలి: సీఎం

image

TG: ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో సమన్వయం కోసం అందరూ కలిసి పని చేయాలని సీఎం రేవంత్, మంత్రులు నిర్ణయించారు. మంత్రులతో సీఎం నిర్వహించిన అత్యవసర భేటీలో పార్టీ, ప్రభుత్వ అంతర్గత అంశాలపై చర్చించారు. జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య అంతరాలు లేకుండా చూడాలని మంత్రులకు సీఎం సూచించారు.

Similar News

News February 1, 2025

చంద్రబాబు సిగ్గుపడాలి: అంబటి రాంబాబు

image

AP: బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీ కంటే బిహార్ ఎక్కువ సాధించిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఇందులో నితీశ్ కుమార్ విజయాన్ని చూసి CM చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. మరోవైపు, తమ నలుగురు కార్పొరేటర్లను టీడీపీలో చేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెమ్మసాని కార్పొరేటర్ స్థాయికి దిగిపోయారని ఎద్దేవా చేశారు. తిరుపతి Dy. మేయర్‌గా పోటీ చేయాలనుకుంటే శేఖర్ రెడ్డి ఇంటిని కూల్చేశారని మండిపడ్డారు.

News February 1, 2025

క్రికెట్‌కు గుడ్‌బై: సాహా

image

భారత క్రికెటర్ వృద్ధిమాన్ సాహా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. 28 ఏళ్ల పాటు స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, క్లబ్, డిస్ట్రిక్ట్, స్టేట్, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. IPLలో KKR, SRH, GT, పంజాబ్‌కు ఆడారు. కుటుంబంతో సమయం గడిపేందుకు, జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నట్లు Xలో పోస్ట్ పెట్టారు. సాహా 40 టెస్టుల్లో 1,353 పరుగులు, 9 ODIల్లో 41, 122 FC మ్యాచుల్లో 6,423 రన్స్ చేశారు.

News February 1, 2025

16 మంది MPలు తెచ్చింది గుండుసున్నా: KTR

image

TG: సీఎం, తెలంగాణ ఎంపీలు కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి చిల్లిగవ్వ సాధించలేదని KTR మండిపడ్డారు. వారు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘కాంగ్రెస్, బీజేపీ నుంచి ఉన్న 16 మంది MPలు తెచ్చింది గుండుసున్నా. జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ ప్రయోజనాలు కాపాడలేవు. బడే భాయ్- చోటే భాయ్ బంధంతో ఏం లాభం లేదు. కేంద్రానికి తెలంగాణపై చిన్నచూపు మరోమారు రుజువైంది’ అని కేటీఆర్ విమర్శించారు.