News February 2, 2025
ఫిబ్రవరి 02: చరిత్రలో ఈ రోజు

✒ 1863: తెలుగు రచయిత కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి జననం
✒ 1902: పండితుడు, స్వాతంత్ర్య సమరయోధులు మోటూరి సత్యనారాయణ జననం
✒ 1940: రచయిత ఎస్వీ రామారావు జననం
✒ 1970: ఒంగోలు జిల్లా అవతరణ
✒ 2012: నిర్మాత, నటుడు అట్లూరి పుండరీకాక్షయ్య మరణం
✒ 2023: దర్శకుడు కె.విశ్వనాథ్ మరణం
Similar News
News January 13, 2026
రేపటి నుంచి ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాలు

అచ్చంపేట మండలంలోని రంగాపూర్ ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో బుధవారం నుంచి వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. 15న ప్రభోత్సవం, 16న కళ్యాణోత్సవం, 17న అశ్వ వాహన సేవ, 18న నంది వాహన సేవ నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ మాధవరెడ్డి తెలిపారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
News January 13, 2026
ఇరాన్ నిరసనలు.. ఇతడికే తొలి ‘ఉరి’..!

సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా ఇరాన్లో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఇప్పటికే 650మందిని పోలీసులు కిరాతకంగా కాల్చి చంపారు. అయినా నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో వారిలో భయం పుట్టించేందుకు నియంతృత్వ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆందోళనలో పాల్గొన్న 26 ఏళ్ల ఇర్ఫాన్ సొల్తానీని రేపు ఉరి తీసేందుకు రంగం సిద్ధంచేసింది. దీంతో మానవహక్కుల ఉద్యమకారులు SMలో అతడికి మద్దతు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.
News January 13, 2026
పాదాల అందం కోసం

మన శరీరంలోనే భాగమైన పాదాల సంరక్షణను అంతగా పట్టించుకోం. దీని వల్ల మడమలకు పగుళ్లు వచ్చి తీవ్రంగా బాధిస్తాయి కూడా. కొన్ని చిట్కాలు పాటించి ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. * పాదాల పగుళ్లు ఉన్నచోట కొద్దిగా తేనె రాసుకొని అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే ఫలితం ఉంటుంది. * ఓట్మీల్, పాల మిశ్రమం కూడా మంచి ఔషధంలా పనిచేస్తుంది. వారానికోసారి ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకుంటే పగుళ్లు మాయమవుతాయి.


