News February 3, 2025
కుంభమేళాలో భక్తుల భద్రతపై నేడు సుప్రీంలో విచారణ
కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాటపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గైడ్లైన్స్ ఇవ్వాలని పిటిషనర్ కోర్టును కోరారు. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రత్యర్థులుగా పిటిషనర్ పేర్కొన్నారు.
Similar News
News February 3, 2025
పుస్తకాలకు బదులు వ్యక్తుల కథలు తెలుసుకునే లైబ్రరీలు!
లైబ్రరీకి వెళ్లగానే ‘సైలెంట్ ప్లీజ్’ అనే బోర్డులు కనిపిస్తుంటాయి. కానీ, డెన్మార్క్లోని లైబ్రరీలలో వివిధ రకాల ప్రజల కథలు మారుమోగుతుంటాయి. పుస్తకాలకు బదులు అక్కడున్న వ్యక్తులను తీసుకెళ్లి, వారి జీవిత కథను వినొచ్చు. ప్రతి వ్యక్తికి ‘నిరుద్యోగి’, ‘శరణార్థి’లాంటి శీర్షికలు ఉంటాయి. వీరి కథలను విని ఒక పుస్తకాన్ని దాని కవర్ చూసి అంచనా వేయకూడదనే విషయాన్ని తెలుసుకుంటారు. దీనిని హ్యూమన్ లైబ్రరీ అంటారు.
News February 3, 2025
అభిషేక్ ఊచకోతకు బౌలర్లు చేతగానివాళ్లలా కనిపించారు: పీటర్సన్
నిన్నటి మ్యాచ్లో అభిషేక్ సెంచరీతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఆ ఇన్నింగ్స్పై ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించారు. ‘పిచ్ బ్యాటింగ్కు బాగుంది కరెక్టే. కానీ అటువైపు ఇంగ్లండ్ బౌలర్లేం తక్కువవారు కాదు. అలాంటి ఆటగాళ్లు కూడా అతడి విధ్వంసాన్ని చేతగానివాళ్లలా చేష్టలుడిగి చూస్తుండిపోయారు. ఇక వరుణ్ చక్రవర్తి సైతం అద్భుతమైన బౌలింగ్ వేశారు. అతడిని ఆడటం చాలా కష్టం’ అని పేర్కొన్నారు.
News February 3, 2025
EAPCET షెడ్యూల్ ఖరారు
తెలంగాణ EAPCET షెడ్యూల్ ఖరారైంది. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష, ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు నిర్వహించనుంది. ఈ నెల 20న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈసారి EAPCETను JNTUH నిర్వహిస్తోంది.