News March 19, 2024
MEO-2లకు ప్రతి నెలా రూ.1,000 అలవెన్స్

AP: మండల విద్యాధికారి-2(MEO-2)లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ప్రతినెలా రూ.1,000 ఫిక్స్డ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటి వరకు MEO-1కు ఈ సదుపాయం ఉండగా, ఇకపై MEO-2లకూ అందించనుంది. పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు వీలుగా ప్రతి మండలంలో ఇద్దరు MEOలను గతేడాది ప్రభుత్వం నియమించింది. వారికి వేర్వేరుగా విధులను కేటాయించింది.
Similar News
News August 28, 2025
20 కోచ్లతో నడవనున్న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్

సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు డిమాండ్ దృష్ట్యా కోచ్ల సంఖ్యను 16 నుంచి 20కి పెంచనున్నారు. జులై 31 నాటికి ఈ రైలుకున్న ఆక్యుపెన్సీ ఆధారంగా రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారం మినహా రోజూ ఉ.6.10 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరే ఈ రైలు మ.2.35కి తిరుపతి చేరుతుంది. అక్కడ 3.15కు బయల్దేరి రాత్రి 11.40కి SC చేరుతుంది. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
News August 28, 2025
సెప్టెంబర్ 7న తాత్కాలికంగా తిరుమల ఆలయం మూసివేత

AP: చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7న తిరుమల ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆ రోజున మధ్యాహ్నం 3.30 గంటలకు ఆలయం తలుపులు మూసి, సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 3 గంటలకు తిరిగి ఓపెన్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 7న ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. 8న ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
News August 28, 2025
మెదక్, కామారెడ్డి జిల్లాలో రేపు సెలవు

TG: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రేపు మెదక్ జిల్లాలో సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జిల్లాలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు హాలిడే ఇచ్చింది. అటు కామారెడ్డి జిల్లాలో శుక్ర, శనివారాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. పలు జిల్లాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురుస్తాయని IMD HYD తెలిపింది. దీంతో సెలవు ప్రకటించే అవకాశం ఉంది. మరి మీ ప్రాంతంలో వాన పడుతోందా? కామెంట్ చేయండి.