News February 4, 2025
అంతుచిక్కని వ్యాధి.. 15 రోజుల్లో 40 లక్షల కోళ్లు మృతి

AP: అంతుచిక్కని వ్యాధి దెబ్బకు పౌల్ట్రీ పరిశ్రమ కుదేలవుతోంది. ఉభయగోదావరి జిల్లాల్లో 450 వరకు పౌల్ట్రీలు ఉండగా, 15 రోజుల్లోనే 40 లక్షలకు పైగా కోళ్లు మృత్యువాత పడినట్లు అంచనా. ఒక్కో కోడి మరణంతో సగటున రూ.300 వరకు నష్టం వస్తోందని రైతులు వాపోతున్నారు. కోళ్ల మరణాలకు కారణాలపై అధికారులు సైతం స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. శాంపిల్స్ను ల్యాబ్కు పంపామని, నివేదిక రావాల్సి ఉందని చెబుతున్నారు.
Similar News
News March 23, 2026
బంగారం ధరలు ఎందుకు పడిపోతున్నాయి?

సాధారణంగా షేర్ మార్కెట్ పడిపోతే బంగారం, వెండికి డిమాండ్ పెరుగుతుంటుంది. కానీ వార్ మొదలయ్యాక ఇవీ క్రాష్ అవుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉండటంతో వడ్డీ రేట్లు పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. అదే జరిగితే స్థిర లాభాలను ఇచ్చే బాండ్లకు డిమాండ్ పెరుగుతుంది. పైగా ఇటీవల బంగారం, వెండి గరిష్ఠాలను తాకాయి. లిక్విడిటీ కొరత కూడా ఉంది. ఈ పరిస్థితిని మదుపర్లు క్యాష్ చేసుకుంటుండటంతో ధరలు తగ్గుతున్నాయి.
News March 23, 2026
ఒకే దేహం.. 2తలలు, 4 కాళ్లతో కవలలు జననం!

యూపీలోని అలీగఢ్లో ఓ మహిళకు అవిభాజ్య కవలలు జన్మించారు. వీరికి రెండు తలలు, రెండు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నాయి. కానీ గుండె మాత్రం ఒక్కటే ఉంది. తన బిడ్డలను చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన తల్లి, ఆవేదనతో కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం శిశువుల ఆరోగ్యం స్థిరంగా ఉండగా.. ఆపరేషన్ చేసి వేరు చేయడంలో సాధ్యాసాధ్యాలను వైద్యులు పరిశీలిస్తున్నారు.
News March 23, 2026
‘నిషేధం’ నుంచి 51603 ఎకరాలకు విముక్తి

AP: పరిశ్రమల కోసం APIICకి GOVT గతంలో 1.56L ఎకరాలు కేటాయించింది. ఇందులో 51603 ఎకరాల పట్టా ల్యాండ్తో పాటు ప్రభుత్వ, DKT భూములూ ఉన్నాయి. వీటిలో 121603 ఎకరాలు రెవెన్యూ రికార్డుల్లో నిషేధిత జాబితాలో ఉన్నాయి. దీంతో వీటిని పొందిన పరిశ్రమలు లోన్స్ పొందలేకపోతున్నాయి. కాగా ఈ భూముల్లో 51603 ఎకరాలు తక్షణమే నిషేధిత జాబితా నుంచి తొలగించి పట్టా భూమిగా IIC పేరిట మ్యుటేషన్ చేయాలని GOVT ఉత్తర్వులు జారీచేసింది.


