News February 4, 2025

ఆలయాల పవిత్రతను కాపాడతాం: మంత్రి

image

AP: రాష్ట్ర చరిత్ర, పవిత్రతను భవిష్యత్తు తరాలకు అందిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆలయాల పునః నిర్మాణానికి నిధులను కేటాయిస్తున్నామన్నారు. ఇప్పటికే నెల్లూరు(D)లో 18 ఆలయాలకు రూ.38కోట్లు రిలీజ్ చేసినట్లు పేర్కొన్నారు. సీఎం సూచనతో రథ సప్తమిని రాష్ట్ర పండుగగా గుర్తించామన్నారు. రాతి కట్టడాలకు గత ప్రభుత్వం రంగులు వేయడంతో పవిత్రతను కోల్పోయాయని, ఆ రంగులను తొలగిస్తామని తెలిపారు.

Similar News

News March 14, 2025

జనసేన ఆవిర్భావ సభ: దారులన్నీ చిత్రాడ వైపే..

image

AP: కాసేపట్లో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం కానుంది. ఇందుకోసం రాష్ట్రం నలుమూలల నుంచి జనసైనికులు చిత్రాడకు బయల్దేరారు. సభ కోసం 50 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. పవన్ సహా 250 మంది వేదికపై కూర్చుంటారు. డొక్కా సీతమ్మ, రాజా సూర్యారావు బహుద్దూర్, మల్లాడి నాయకర్ పేర్లతో ద్వారాలు సిద్ధం చేశారు. పవన్ మ.3.30 గంటలకు ఇక్కడికి చేరుకోనున్నారు.

News March 14, 2025

ఢిల్లీ నుంచి ఒక్క రూపాయీ తేలేదు: KTR

image

TG: సీఎం రేవంత్ 39 సార్లు ఢిల్లీ వెళ్లి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారని, కానీ అక్కడి నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తేలేదని KTR విమర్శించారు. ‘ ఓటేసి మోసపోయాం అని జనం చివాట్లు పెడుతుంటే ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నావ్. నీళ్లు లేక పంటలు ఎండిపోతే కనీసం సాగునీళ్లపై సమీక్ష కూడా లేదు. హామీల అమలు చేతగాక గాలి మాటలు, గబ్బు కూతలు. జాగో తెలంగాణ జాగో’ అని ట్వీట్ చేశారు.

News March 14, 2025

ఇన్సూరెన్స్ కంపెనీ కొంటున్న బాబా రాందేవ్

image

FMCG మేజర్, బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద బీమా రంగంలోకి ప్రవేశిస్తోంది. మాగ్మా ఇన్సూరెన్స్‌లో తన 90% వాటాను పతంజలి, DS గ్రూప్‌నకు విక్రయిస్తున్నట్టు అదార్ పూనావాలా ప్రకటించారు. ఈ డీల్ విలువ రూ.4500 కోట్లని తెలుస్తోంది. ప్రస్తుతం వెహికల్, హెల్త్, పర్సనల్ యాక్సిడెంట్, హోమ్, కమర్షియల్ ఇన్సూరెన్స్ సేవలను మాగ్మా అందిస్తోంది. FY24లో కంపెనీ GWP రూ.3,295 కోట్లుగా ఉంది.

error: Content is protected !!