News February 4, 2025

ఆలయాల పవిత్రతను కాపాడతాం: మంత్రి

image

AP: రాష్ట్ర చరిత్ర, పవిత్రతను భవిష్యత్తు తరాలకు అందిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆలయాల పునః నిర్మాణానికి నిధులను కేటాయిస్తున్నామన్నారు. ఇప్పటికే నెల్లూరు(D)లో 18 ఆలయాలకు రూ.38కోట్లు రిలీజ్ చేసినట్లు పేర్కొన్నారు. సీఎం సూచనతో రథ సప్తమిని రాష్ట్ర పండుగగా గుర్తించామన్నారు. రాతి కట్టడాలకు గత ప్రభుత్వం రంగులు వేయడంతో పవిత్రతను కోల్పోయాయని, ఆ రంగులను తొలగిస్తామని తెలిపారు.

Similar News

News October 31, 2025

బ్రూసెల్లోసిస్‌ వ్యాధి.. నివారణ, జాగ్రత్తలు

image

ఈ వ్యాధి నివారణకు ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలి. 4 నుంచి 8 నెలల వయసున్న దూడలకు బ్రూసెల్లా వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. పశువు ఈడ్చుకు పోయినప్పుడు దాని పిండాన్ని, మాయను, గర్భాశయ ద్రవాలు, ఇతర చెత్తను దూరంగా తీసుకెళ్లి కాల్చేయాలి. వ్యాధి సోకిన పశువులను మంద నుంచి దూరంగా ఉంచాలి. పశువుల పాకలను శుభ్రంగా ఉంచాలి. చికిత్స చేసేటప్పుడు వెటర్నరీ డాక్టర్లు తగిన వ్యక్తిగత రక్షణ చర్యలు తీసుకోవాలి.

News October 31, 2025

‘బాహుబలి-ది ఎపిక్’ పబ్లిక్ టాక్

image

బాహుబలి సినిమా రెండు పార్టులను కలిపి మేకర్స్ ‘బాహుబలి-ది ఎపిక్’గా రిలీజ్ చేశారు. పాతదే అయినా కొత్త మూవీ చూసినట్లు అనిపిస్తోందని ప్రీమియర్లు చూసిన వారు చెబుతున్నారు. ఎడిటింగ్, మ్యూజిక్, విజువల్స్ అన్నీ కొత్తగా అనిపిస్తున్నాయంటున్నారు. అయితే కొన్ని నచ్చిన సీన్లతో పాటు పాటలు లేకపోవడం నిరాశకు గురిచేసిందని చెబుతున్నారు. మరికొన్ని గంటల్లో WAY2NEWS రివ్యూ.

News October 31, 2025

నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదనే నమ్ముతా: ఉప రాష్ట్రపతి

image

నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదని దేవర్ చెప్పినట్లు ఉపరాష్ట్రపతి CP రాధాకృష్ణన్ పేర్కొన్నారు. తమిళనాడులోని పసుంపొన్‌లో స్వాతంత్ర్య సమరయోధుడు ముత్తురామలింగ దేవర్ జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. “నేతాజీకి దేవర్ బలమైన మద్దతుదారుడు. ఆయన జీవితంలో అబద్ధం ఆడలేదు. ‘నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదు. నేను ఆయన్ను కలిశాను’ అని దేవర్ చెప్పారు. నేను అదే నమ్ముతాను” అని తెలిపారు.