News March 19, 2024

ఢిల్లీకి పురందీశ్వరి.. అభ్యర్థుల ఎంపికపై చర్చ

image

AP: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి ఢిల్లీకి వెళ్లారు. TDP-JSPతో పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ సీట్లలో ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను అధిష్ఠానానికి అందించనున్నారు. అలాగే పొత్తుపై విమర్శలు చేస్తూ పలువురు బీజేపీ రాష్ట్ర నేతలు రాసిన లేఖపైనా సమాలోచనలు చేస్తారని తెలుస్తోంది. వీలైనంత త్వరగా అభ్యర్థుల లిస్టును విడుదల చేసి ప్రచారం ప్రారంభించాలని జాతీయ నేతలు యోచిస్తున్నారు.

Similar News

News August 29, 2025

విజయనగరం ఉగ్ర కుట్ర కేసు.. మరొకరు అరెస్ట్

image

AP: విజయనగరం ఐసిస్ ఉగ్ర కుట్ర కేసులో బిహార్‌కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ అరెస్టయ్యారు. పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు NIA వెల్లడించింది. గతంలో <<16451593>>అరెస్టైన <<>>నిందితులు సమీర్, సిరాజ్‌లతో ఆరిఫ్‌కు సంబంధాలున్నాయని గుర్తించింది. వీరంతా కలిసి ఉగ్రదాడులకు కుట్ర పన్నారని, జిహాదీ కార్యక్రమాల కోసం ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు నిర్ధారించినట్లు NIA తెలిపింది.

News August 29, 2025

కుప్పంలో ఐఫోన్ చాసిస్ తయారీ ప్లాంట్: TDP

image

APలో రూ.586 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు హిందాల్కో సంస్థ ముందుకొచ్చినట్లు టీడీపీ ట్వీట్ చేసింది. ‘ఐఫోన్ తయారీలో ఉపయోగించే చాసిస్‌లు, భాగాలు, పీసీబీలు కుప్పంలోనే తయారుకానున్నాయి. గ్లోబల్ స్మార్ట్ ఫోన్ తయారీ రంగంలో రాష్ట్రం కీలకంగా మారుతుంది. హిందాల్కో ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ ఫెసిలిటీ ఏర్పాటు కానుంది. 2027 నాటికి పూర్తయ్యే ఈ యూనిట్‌తో 1000 మందికి ఉద్యోగాలు వస్తాయి’ అని ట్వీట్ చేసింది.

News August 28, 2025

ఆస్తి, ప్రాణ, పంట నష్టం జరగకూడదు: సీఎం రేవంత్

image

TG: భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎలాంటి ఆస్తి, ప్రాణ, పంట నష్టం జరగకుండా చూడాలని సూచించారు. ‘వాగులు పొంగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. హైలెవెల్ బ్రిడ్జిలు నిర్మించాలి. ఫొటో, వీడియో క్యాప్చర్ ద్వారా పంట నష్టం అంచనా వేయాలి. సమగ్ర వివరాలను భద్రపరచాలి. వర్షపాతం వివరాలు కూడా ప్రజలకు తెలియజేయాలి’ అని ఆయన దిశానిర్దేశం చేశారు.