News February 5, 2025
నేడు కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్

TG: BC కులగణన, SC వర్గీకరణ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష BRS విమర్శలు ఎక్కుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణలపై కాంగ్రెస్ సర్కారు వివరణ ఇవ్వనుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో క్యాబినెట్ సబ్ కమిటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనుంది. స్పీకర్ ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్, బీసీ, ఎస్సీ సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 20, 2026
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 901 పాయింట్లు పెరిగి 75,109 వద్ద.. నిఫ్టీ 286 పాయింట్లు పుంజుకొని 23,288 వద్ద ట్రేడవుతోంది. నిన్నటి భారీ నష్టాలతో కీలక రంగాల్లో షేర్లు ఆకర్షణీయ ధరలకే లభిస్తుండడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగుతున్నారు. మరోవైపు నిన్న భారీగా పెరిగిన చమురు ధరలు కాస్త దిగిరావడం కూడా కలిసొచ్చింది. సెన్సెక్స్-30 సూచీలో HDFC షేరు మాత్రమే నష్టాల్లో ఉంది.
News March 20, 2026
పూజ గదిలో బొమ్మపై విమర్శలు.. మంత్రి లోకేశ్ క్లారిటీ

AP: ఉగాది సందర్భంగా నిన్న కుమారుడు దేవాన్ష్తో కలిసి పూజలో పాల్గొన్న ఫొటోలను మంత్రి లోకేశ్ షేర్ చేశారు. అయితే పూజ గదిలో ఓ మూలన కనిపించిన చిన్నబొమ్మపై పలువురు విమర్శలు చేయగా మంత్రి కౌంటర్ ఇచ్చారు. నాలుగేళ్ల వయసులో దేవాన్ష్ చేసిన శివుడు, శివలింగం ఆకృతులను గుర్తుగా పూజగదిలో ఉంచామన్నారు. దేవుడిపై విశ్వాసాన్ని కొందరే అర్థం చేసుకుంటారని, అలాగే ఇలాంటి భక్తిని వివరించాల్సిన అవసరం లేదన్నారు.
News March 20, 2026
IPL: ఇంజ్యూర్డ్ ప్రీమియర్ లీగ్.. నెట్టింట ట్రోల్స్

IPL కీలక ప్లేయర్లు గాయాలబారిన పడి లీగ్కు దూరం అవుతున్నారు. దీంతో IPLను ఇంజ్యూర్డ్ ప్రీమియర్ లీగ్ అంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. ఎల్లిస్(CSK), సామ్ కరన్(RR), హర్షిత్(KKR), మిల్నే(RR), జాక్ ఎడ్వర్డ్స్(SRH), హసరంగా(LSG) ఇప్పటికే లీగ్ నుంచి వైదొలిగారు. ఇక హేజిల్ వుడ్(RCB), కమిన్స్(SRH) గాయాలతో కొన్ని మ్యాచులకు దూరం కానున్నారు. ఈనెల 28న లీగ్ ప్రారంభమయ్యేలోపు ఇంకెంత మంది ఇలా గాయాలబారిన పడతారో?


