News February 5, 2025

కులగణన సర్వేలో మళ్లీ వివరాలివ్వొచ్చు: మంత్రి పొన్నం

image

TG: కులగణన సర్వేలో పాల్గొనని వారు మళ్లీ వివరాలు ఇవ్వొచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్ చేశారు. అన్ని వర్గాలకు మేలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తప్పుడు వార్తల వ్యాప్తి బలహీన వర్గాలపై దాడేనని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై వైఖరి ఏంటో ప్రతి పార్టీ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించాలని అనుకుంటే ఎదుర్కొంటామని చెప్పారు.

Similar News

News December 30, 2025

హర్మన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. భారత్ స్కోర్ ఎంతంటే?

image

శ్రీలంక ఉమెన్స్ టీమ్‌తో జరుగుతున్న 5వ టీ20లో భారత్ 175/7 రన్స్‌ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 77 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో కెప్టెన్ హర్మన్‌‌ప్రీత్ 43 బంతుల్లో 68 రన్స్ చేసి ఆదుకున్నారు. చివర్లో అరుంధతీ రెడ్డి బౌండరీలతో చెలరేగారు. ఆమె 11 బంతుల్లో 27* రన్స్‌తో రాణించారు.

News December 30, 2025

వాస్తు రహస్యం: ఇంటి బ్రహ్మస్థానం ప్రాముఖ్యత

image

ఇంటికి మధ్యభాగమైన బ్రహ్మస్థానంలో ఏ బరువు ఉండకూడదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘ఇది ఇంటికి నాభి వంటిది. ఇక్కడి నుంచే సానుకూల శక్తి నలువైపులా ప్రసరిస్తుంది. ఈ భాగం ఖాళీగా, శుభ్రంగా, వెలుతురుతో ఉండాలి. గోడలు, స్తంభాలు, బరువులు ఉంచకూడదు. ఒకప్పుడు ఇక్కడ ఆకాశం కనిపించేలా ముంగిలి వదిలేవారు. ఈ స్థానాన్ని పవిత్రంగా ఉంచితే ఇంట్లో ఆరోగ్యం, అభివృద్ధి, ప్రశాంతత లభిస్తాయి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News December 30, 2025

డైలీ 4వేల అడుగులు వేస్తే మరణ ముప్పు తగ్గినట్లే: అధ్యయనం

image

యువకుల్లా వృద్ధులూ రోజూ 10 వేల అడుగులు నడవాల్సిన అవసరం లేదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. 72 ఏళ్ల వృద్ధ మహిళలపై 11 ఏళ్ల పాటు జరిపిన పరిశోధనలో.. వారానికి కేవలం 1-2 రోజులు 4,000 అడుగులు నడిచినా గుండె జబ్బులు, మరణాల ముప్పు గణనీయంగా తగ్గుతుందని తేలింది. మెట్లు ఎక్కడం, భోజనం తర్వాత నడక వంటి చిన్న చిన్న మార్పులతో ఈ లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. SHARE IT