News February 5, 2025
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉత్తమ్ వార్నింగ్

TG: బీసీ కులగణనపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కోసమే రేపు సీఎం రేవంత్తో సమావేశం కానున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజల అపోహలు తొలగించడమే తమ లక్ష్యమని చెప్పారు. దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సమగ్ర కులగణనపై అనవసర రాద్ధాంతం చేయొద్దన్నారు. ఎవరైనా పార్టీ లైన్ దాటి మాట్లాడితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News April 6, 2026
ఇరాన్, USకు సీజ్ఫైర్ ప్లాన్.. ఏం జరగబోతోంది?

యుద్ధాన్ని ఆపేందుకు ఇరాన్, USకు సీజ్ఫైర్ ప్లాన్ అందినట్లు Reuters తెలిపింది. వెంటనే కాల్పుల విరమణకు ఒప్పుకోవాలని, హార్ముజ్ను ఓపెన్ చేయాలని ప్రపోజల్స్ పెట్టినట్లు చెప్పింది. ఈ డ్రాఫ్ట్ ప్లాన్ను పాక్ రూపొందించినట్లు పేర్కొంది. అన్ని అంశాలపై ఈ రోజే అంగీకారం కుదరాలని సూచించినట్లు వెల్లడించింది. US ఉపాధ్యక్షుడు JD వాన్స్, ఇరాన్ మంత్రి అరాఘ్చీతో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ చర్చించినట్లు తెలిపింది.
News April 6, 2026
డెలివరీ ఏజెంట్స్ లిఫ్ట్ వాడొద్దా.. మీరేమంటారు?

ప్రస్తుతం అన్నీ డోర్ డెలివరీలే. కానీ వాటిని చేరవేసే వారికి మాత్రం కనీస గౌరవం దక్కట్లేదు. కొన్ని అపార్ట్మెంట్లలో డెలివరీ బాయ్స్ లిఫ్ట్ వాడొద్దని ఆంక్షలు పెట్టి, వాడితే జరిమానాలు వేస్తున్నారు. 2AMకు కూడా మెట్లు ఎక్కి రావాలనే కస్టమర్ల ప్రవర్తన తమను అవమానపరచడమే అని ఓ డెలివరీ ఏజెంట్ చేసిన పోస్ట్ వైరలవుతోంది. వారు కూడా మనుషులేనని, వారికి కనీస మర్యాద ఇవ్వాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. మీ కామెంట్?
News April 6, 2026
ఏపీకి ఒకే ఒక్క రాజధాని అమరావతి: సీఎం

AP: అమరావతికి YCP తప్ప దేశంలోని అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని సీఎం చంద్రబాబు అనంతపురం సభలో అన్నారు. ఏపీకి ఒకే ఒక్క రాజధాని అమరావతి అని స్పష్టం చేశారు. నిన్నటి వరకు రాష్ట్రానికి అడ్రస్ లేకుండా చేశారని, ఇప్పుడు అమరావతి రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా చేశామన్నారు. రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు. అమరావతి అని పలకడం ఇష్టం లేక మావిగన్ అంటూ పిచ్చిమాటలు మాట్లాడుతున్నారని ఫైరయ్యారు.


