News February 5, 2025

జనగామ: నూతన సాంకేతిక పద్ధతులతో వ్యవసాయం చేయాలి: కలెక్టర్

image

రఘునాథపల్లి మండలంలోని నిడిగొండలో కేంద్రీయ పత్తి పరిశోధన సంస్థ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కిసాన్ మేళా, వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు నూతన సాంకేతిక పద్ధతులతో వ్యవసాయం చేయాలని అన్నారు.

Similar News

News February 6, 2025

సాయి పల్లవితో డాన్స్ చాలా కష్టం: నాగ చైతన్య

image

నిజమైన ప్రేమలో ఉండే బాధను ‘తండేల్’లో చూపించబోతున్నామని హీరో నాగచైతన్య చెప్పారు. స్క్రిప్ట్, తన లుక్ కసరత్తులకే 8 నెలల టైమ్ కేటాయించామని ప్రెస్‌మీట్‌లో తెలిపారు. ఈ చిత్రంలో సాయిపల్లవి నటన అద్భుతమని కొనియాడారు. ఆమెతో కలిసి డాన్స్ చేయాలని చాలా కష్టపడాల్సి ఉంటుందన్నారు. శివపార్వతుల స్ఫూర్తితో తమ పాత్రలు డిజైన్ చేశామని, అందుకు శివశక్తి థీమ్ సాంగ్ పెట్టామని పేర్కొన్నారు.

News February 6, 2025

MDCL:14,238 ఎకరాలకు రైతు భరోసా కట్..!

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సాగుకు అనుకూలంగా లేని భూముల సర్వే నిర్వహించారు. 78,261 ఎకరాల భూముల్లో 14,238 ఎకరాల భూమి సాగుకు అనుకూలంగా లేదని గుర్తించినట్లుగా DAO చంద్రకళ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం సాగుకు అనుకూలంగా ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ప్రతి ఏటా ఎకరాకు రూ.12,000 చొప్పున అందిస్తామని తెలిపిన సంగతి తెలిసిందే. 

News February 6, 2025

దేవాపూర్ సిమెంట్ కంపెనీ డ్రైవర్ మృతిపై కేసు

image

దేవాపూర్ సిమెంట్ కంపెనీలో పనిచేస్తున్న డ్రైవర్ రవీందర్ సింగ్(36)మృతిపై కేసు నమోదు చేసినట్లు SI ఆంజనేయులు తెలిపారు. రవీందర్‌కు మంగళవారం రాత్రి చాతిలో నొప్పి రావడంతో తోటి ఉద్యోగులు అతడిని కంపెనీ డిస్పెన్సరీకి, అనంతరం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. అతడి భార్య మహిమ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.

error: Content is protected !!