News February 5, 2025

అంతర్వేదికి ప్రత్యేక బస్సులు

image

అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాల్లో భాగంగా ఈనెల 7న స్వామివారి కళ్యాణం, 8న రథోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఆ రెండు రోజులు ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అమలాపురం డిపో మేనేజర్ సీహెచ్.ఎస్.ఎన్.మూర్తి తెలిపారు. అమలాపురం-అంతర్వేది, అప్పనపల్లి- అంతర్వేది, పల్లం-అంతర్వేది రూట్లో 46 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు. ప్రయాణికులు ఈ బస్సులను వినియోగించుకోవాలని కోరారు.

Similar News

News February 6, 2025

కామారెడ్డి: జిల్లా అధ్యక్షురాలి నియామకం

image

మహిళా కాంగ్రెస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా పాక జ్ఞానేశ్వరి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఆమెకు నియామకపత్రాన్ని అందజేశారు. రెండోసారి తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్షురాలిగా నియమించిన ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అలకలంబ, రాష్ట్ర అధ్యక్షురాలు సునీత రావుకు కృతజ్ఞతలు తెలిపారు.

News February 6, 2025

సాయి పల్లవితో డాన్స్ చాలా కష్టం: నాగ చైతన్య

image

నిజమైన ప్రేమలో ఉండే బాధను ‘తండేల్’లో చూపించబోతున్నామని హీరో నాగచైతన్య చెప్పారు. స్క్రిప్ట్, తన లుక్ కసరత్తులకే 8 నెలల టైమ్ కేటాయించామని ప్రెస్‌మీట్‌లో తెలిపారు. ఈ చిత్రంలో సాయిపల్లవి నటన అద్భుతమని కొనియాడారు. ఆమెతో కలిసి డాన్స్ చేయాలని చాలా కష్టపడాల్సి ఉంటుందన్నారు. శివపార్వతుల స్ఫూర్తితో తమ పాత్రలు డిజైన్ చేశామని, అందుకు శివశక్తి థీమ్ సాంగ్ పెట్టామని పేర్కొన్నారు.

News February 6, 2025

MDCL:14,238 ఎకరాలకు రైతు భరోసా కట్..!

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సాగుకు అనుకూలంగా లేని భూముల సర్వే నిర్వహించారు. 78,261 ఎకరాల భూముల్లో 14,238 ఎకరాల భూమి సాగుకు అనుకూలంగా లేదని గుర్తించినట్లుగా DAO చంద్రకళ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం సాగుకు అనుకూలంగా ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ప్రతి ఏటా ఎకరాకు రూ.12,000 చొప్పున అందిస్తామని తెలిపిన సంగతి తెలిసిందే. 

error: Content is protected !!