News February 6, 2025
ఉపాసన కొత్త కార్యక్రమం.. తొలుత పిఠాపురంలో అమలు

అపోలో ఆస్పత్రుల అధినేత, తన తాత ప్రతాప్ రెడ్డి బర్త్ డే(FEB5) సందర్భంగా ఉపాసన కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా శిశు సంక్షేమం కోసం పిఠాపురం నుంచి ప్రత్యేక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు. గర్భిణులకు పౌష్ఠికాహారం, ప్రసూతి, శిశు మరణాలను అరికట్టడం, మహిళా సాధికారతపై అవగాహన కల్పించడం దీని ఉద్దేశమన్నారు. త్వరలోనే 109 అంగన్వాడీ భవనాలు పునరుద్ధరిస్తామని చెప్పారు.
Similar News
News January 2, 2026
2025లో శ్రీవారి ఆదాయం రూ.1,383 కోట్లు

AP: 2025లో తిరుమల శ్రీవారికి భారీగా ఆదాయం వచ్చింది. హుండీ ద్వారా రూ.1,383.90 కోట్లు లభించగా, ఇది 2024తో పోలిస్తే రూ.18 కోట్లు అధికం. 2.61 కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. లడ్డూ విక్రయాల్లోనూ రికార్డు నమోదైంది. మొత్తం 13.52 కోట్ల లడ్డూలు అమ్ముడవగా, గత ఏడాదితో పోలిస్తే 1.37 కోట్లు ఎక్కువ. డిసెంబరు 27న గత పదేళ్లలో అత్యధికంగా 5.13 లక్షల లడ్డూల విక్రయం జరిగింది.
News January 2, 2026
IIM బుద్ధగయలో నాన్ టీచింగ్ పోస్టులు

<
News January 2, 2026
వామకుక్షితో ఆరోగ్యం, ఆనందం

ఎడమ వైపు పడుకుంటే జీర్ణాశయం ఆకృతి కారణంగా ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. గుండెపై ఒత్తిడిని తగ్గించి, రక్తప్రసరణను సాఫీగా మారుస్తుంది. కాలేయం, కిడ్నీలు బాగా పనిచేసి వ్యర్థాలను బయటకు పంపుతాయి. ఈ భంగిమ మెదడును చురుగ్గా ఉంచి, మధ్యాహ్నం వచ్చే అలసటను తగ్గిస్తుంది. గర్భిణీలకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు ఇలా చేయడం వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దూరమై సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. SHARE IT


