News February 6, 2025
మరో టీమ్ను కొనుగోలు చేసిన కావ్యా మారన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738783784401_695-normal-WIFI.webp)
సన్ గ్రూప్ వారసురాలు కావ్యా మారన్ మరో క్రికెట్ టీమ్ను కొనుగోలు చేశారు. ఇంగ్లండ్ వేదికగా జరిగే ‘ది హండ్రెడ్’ లీగ్లో Northern సూపర్ ఛార్జెస్ ఫ్రాంచైజ్ను సొంతం చేసుకున్నారు. ఇప్పటికే ఆమె ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, SA20లో ఈస్ట్రర్న్ కేప్ టౌన్ టీమ్లకు ఓనర్గా ఉన్న విషయం తెలిసిందే. కాగా హండ్రెడ్ లీగ్లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ టీమ్ను MI, మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టును LSG కొనుగోలు చేశాయి.
Similar News
News February 6, 2025
అందుకే సాయి పల్లవిని ‘తండేల్’కు తీసుకున్నాం: అల్లు అరవింద్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738812724712_1045-normal-WIFI.webp)
తండేల్ సినిమాలో హీరోయిన్ పాత్రకు సాయి పల్లవి వంద శాతం న్యాయం చేశారని నిర్మాత అల్లు అరవింద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘సాయి పల్లవిని హీరోయిన్ పాత్రకు ఎంపిక చేసింది నేనే. ముంబై నుంచి వచ్చే అమ్మాయిలు ఈ పాత్రకు న్యాయం చేయలేరని నాకు అనిపించింది. ఎన్నో భావోద్వేగాల్ని పండించాల్సిన పాత్ర కావడంతో సాయి పల్లవే సరైన ఛాయిస్ అని ఆమెను తీసుకున్నాం. ఈ పాత్ర ప్రేక్షకులకు చాలాకాలం గుర్తుండిపోతుంది’ అని కొనియాడారు.
News February 6, 2025
పాక్పై ఓడితే గుచ్చి గుచ్చి అడుగుతారు: రవి శాస్త్రి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738815060817_1045-normal-WIFI.webp)
భారత్-పాక్ మ్యాచ్ ప్రత్యేకమేమీ కాదని, అన్ని మ్యాచుల్లాగే దాన్నీ పరిగణిస్తామన్న కోచ్ గంభీర్ వ్యాఖ్యలపై మాజీ కోచ్ రవిశాస్త్రి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘కోచ్గా ఉన్నప్పుడు నేనూ మీడియాకు ఇదే మాట చెప్పేవాడిని. కానీ నిజమేంటంటే పాక్పై గెలవడం చాలా కీలకం. ఆ జట్టుపై ఎన్ని మ్యాచులు గెలిచినా ఒక్క మ్యాచ్ ఓడితే చాలు పాతవన్నీ మర్చిపోయి ఓటమి గురించే అందరూ గుచ్చి గుచ్చి అడుగుతారు’ అని వ్యాఖ్యానించారు.
News February 6, 2025
Stock Markets: పెరిగిన డిఫెన్సివ్ స్టాక్స్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_92024/1727691857109-normal-WIFI.webp)
స్టాక్మార్కెట్లు మోస్తరు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడం లేదు. బంగారం, డాలర్ ఇండెక్స్, US బాండ్ యీల్డులు పెరగడం అనిశ్చితిని సూచిస్తోంది. నిఫ్టీ 23,638 (-58), 78,102 (-163) వద్ద ట్రేడవుతున్నాయి. ఐటీ, మీడియా, ఫార్మా, హెల్త్కేర్ సూచీలు ఎగిశాయి. ఆటో, FMCG, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది.