News February 6, 2025
మరో టీమ్ను కొనుగోలు చేసిన కావ్యా మారన్

సన్ గ్రూప్ వారసురాలు కావ్యా మారన్ మరో క్రికెట్ టీమ్ను కొనుగోలు చేశారు. ఇంగ్లండ్ వేదికగా జరిగే ‘ది హండ్రెడ్’ లీగ్లో Northern సూపర్ ఛార్జెస్ ఫ్రాంచైజ్ను సొంతం చేసుకున్నారు. ఇప్పటికే ఆమె ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, SA20లో ఈస్ట్రర్న్ కేప్ టౌన్ టీమ్లకు ఓనర్గా ఉన్న విషయం తెలిసిందే. కాగా హండ్రెడ్ లీగ్లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ టీమ్ను MI, మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టును LSG కొనుగోలు చేశాయి.
Similar News
News March 20, 2025
రేపు 49 మండలాల్లో వడగాలులు

AP: రేపు రాష్ట్రంలోని 49 మండలాల్లో <
News March 20, 2025
యూట్యూబ్ చూసి సొంతంగా ఆపరేషన్.. చివరికి!

కడుపునొప్పి తాళలేక ఓ వ్యక్తి యూట్యూబ్ సాయంతో ఆపరేషన్కు ప్రయత్నించి ఆస్పత్రి పాలయ్యాడు. UP మధురలో ఈ ఘటన జరిగింది. అనేక మంది వైద్యులను సంప్రదించినా రాజబాబు(32)కు కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభించలేదు. దీంతో మత్తు ఇంజెక్షన్, ఇతర సామగ్రి కొని ఆపరేషన్ మొదలుపెట్టాడు. మత్తు ప్రభావం తగ్గడంతో నొప్పి ఎక్కువై అరుస్తూ బయటికి పరిగెత్తగా, కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.
News March 20, 2025
ఉద్యోగులకు రేపు రూ.6,200 కోట్ల బకాయిల చెల్లింపు

AP: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రేపు వారికి రూ.6,200 కోట్ల CPS, GPF, APGAI బకాయిలు చెల్లించాలని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 11న దాదాపు రూ.1,033 కోట్ల బకాయిలను చెల్లించిన విషయం తెలిసిందే.