News February 6, 2025
స్పాండిలైటిస్ నివారణ మార్గాలివే
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738782493131_695-normal-WIFI.webp)
✒ డాక్టర్ల సూచన మేరకు వ్యాయామాలు చేయాలి. ఔషధాలు తీసుకోవాలి. జీవన విధానాన్ని మార్చుకోవాలి.
✒ కూర్చునే, పడుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
✒ ఆహారంలో క్యాల్షియం, ప్రొటీన్, విటమిన్లు పుష్కలంగా ఉండాలి.
✒ ఒమేగా-3 సప్లిమెంట్లు ఉండే అవిసె గింజలు, వాల్నట్స్, చేపలు, తాజా పండ్లు, కూరగాయాలు, పాలు, చీజ్, సోయా, మీల్మేకర్ తినాలి.
✒ మద్యపానానికి దూరంగా ఉండాలి.
Similar News
News February 6, 2025
ఘోరం.. విద్యార్థినిపై ముగ్గురు టీచర్ల లైంగికదాడి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735443612686_367-normal-WIFI.webp)
పాఠాలు చెప్పే టీచర్లే కీచకులుగా మారారు. 13 ఏళ్ల బాలికపై ముగ్గురు టీచర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తమిళనాడులోని కృష్ణగిరి ప్రభుత్వ పాఠశాలలో బాలిక 8వ తరగతి చదువుతోంది. నెల రోజుల నుంచి స్కూల్కి రాకపోవడంతో ప్రిన్సిపల్ ఆరా తీయగా అసలు విషయం బయట పడింది. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చిందని తల్లి వెల్లడించింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
News February 6, 2025
త్వరలో ‘ఎల్లమ్మ’ నుంచి అప్డేట్: వేణు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738815957199_746-normal-WIFI.webp)
‘బలగం’ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ వేణు నెక్స్ట్ సినిమా ‘ఎల్లమ్మ’ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా దీనిపై వేణు ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘సిద్ధమవుతున్నా. త్వరలో అప్డేట్ వస్తుంది’ అని పేర్కొంటూ జిమ్లో కసరత్తు చేస్తోన్న ఫొటోలు షేర్ చేశారు. దీంతో ఈ సినిమాలో వేణు కూడా ఇంట్రెస్టింగ్ పాత్రలో కనిపిస్తారనే చర్చ మొదలైంది.
News February 6, 2025
కాంగ్రెస్ రాకతో పాత కష్టాలు: కేటీఆర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737085250278_893-normal-WIFI.webp)
TG: రాష్ట్ర సచివాలయంలోనే కాదు గ్రామ సచివాలయాల్లోనూ పాలన పడకేసిందని మాజీ మంత్రి కేటీఆర్ Xలో విమర్శించారు. గ్రామాలన్నీ సమస్యల ఊబిలో చిక్కుకున్నాయని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయని, కాంగ్రెస్ వచ్చి పాత కష్టాలు తీసుకొచ్చిందని విమర్శించారు. సీఎం ఇకనైనా మొద్దునిద్ర వీడాలని, గ్రామాల్లో సమస్యల పంచాయితీని తేల్చాలని రాసుకొచ్చారు. ప్రజా పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు.