News February 6, 2025

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్

image

TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆయన వెంట వెళ్లనున్నారు. ఈ పర్యటనలో తమ పార్టీ అధ్యక్షుడు ఖర్గే సహా పలువురు అగ్రనేతలతో సీఎం భేటీ కానున్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ సహా పలు నిర్ణయాలపై అధిష్ఠానానికి రేవంత్ వివరిస్తారని తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో పార్టీ కూర్పు, మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్యేల విషయంపైనా ఆయన చర్చించవచ్చని సమాచారం.

Similar News

News February 6, 2025

జమిలి ఎన్నికలపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

image

AP: రాష్ట్రంలో దారుణమైన పాలన కొనసాగుతోందని YS జగన్ దుయ్యబట్టారు. ‘జమిలి ఎన్నికలు వస్తాయంటున్నారు. ఎంత త్వరగా వస్తే అంత త్వరగా చంద్రబాబును పంపాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. బాబును చొక్కా పట్టుకొని ప్రశ్నించే రోజులు, తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. బాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టడమేనని పదేపదే చెప్పా. చంద్రముఖిని మళ్లీ నిద్రలేపి రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు.

News February 6, 2025

2027లో చంద్రయాన్-4 లాంచ్

image

చంద్రుడిపై రాతి నమూనాలను తీసుకొచ్చే చంద్రయాన్-4ను భారత్ 2027లో లాంచ్ చేస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఈ మిషన్లో LVM-3 రాకెట్‌ను 2సార్లు అంతరిక్షంలోకి పంపిస్తారని తెలిపారు. అవి తీసుకెళ్లే వేర్వేరు పరికరాలను చంద్రుడి కక్ష్యలోనే అసెంబుల్ చేస్తారని వివరించారు. ఆస్ట్రోనాట్‌ను రోదసిలోకి పంపే గగన్‌యాన్, సముద్ర గర్భంలో 6000KM లోతుకు వెళ్లే సముద్రయాన్‌ను 2026లో లాంచ్ చేస్తామన్నారు.

News February 6, 2025

విజయసాయి రెడ్డి రాజీనామాపై తొలిసారి స్పందించిన జగన్

image

AP: విజయ‌సాయి రెడ్డి రాజీనామాపై YS జగన్ తొలిసారి స్పందించారు. ‘మాకు 11 మంది రాజ్యసభ ఎంపీలుంటే సాయిరెడ్డితో కలిపి ఇప్పటివరకు నలుగురు వెళ్లిపోయారు. అయినా YCPకి ఏమీ కాదు. రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యం. అది సాయిరెడ్డికైనా, ఇప్పటివరకు పోయినవారికైనా, ఇంకా ఒకడో, ఇద్దరో వెళ్లేవారికైనా అదే వర్తిస్తుంది. క్యారెక్టర్‌ను బట్టే ఉంటుంది. YCP కేవలం దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతోనే నడుస్తుంది’ అని స్పష్టం చేశారు.

error: Content is protected !!