News February 6, 2025

ఆ వ్యక్తితో మాకు సంబంధం లేదు: కల్కి నిర్మాణ సంస్థ

image

తమ సంస్థలో పనిచేసే ఉద్యోగి ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌కు పాల్పడి అరెస్టయ్యారని జరుగుతున్న ప్రచారంపై ‘కల్కి’ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ స్పందించింది. నీలేశ్ చోప్రా అనే వ్యక్తి తమ ఆఫీసులో పనిచేయలేదని, ఏ విధంగానూ అతనితో సంస్థకు సంబంధాలు లేవని Xలో పేర్కొంది. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసినట్లు వెల్లడించింది. ఏదైనా సమాచారాన్ని పబ్లిష్ చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని సూచించింది.

Similar News

News February 6, 2025

రేపు ఒంగోలులో ఆర్జీవీ విచారణ

image

AP: సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మను రేపు ఒంగోలు రూరల్ పీఎస్‌లో పోలీసులు విచారించనున్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని గతంలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు రావాలని రెండుసార్లు పోలీసులు నోటీసులిచ్చినా వర్మ హాజరుకాలేదు. తాజాగా ఫిబ్రవరి 4న మరోసారి సమన్లు ఇవ్వగా ఈనెల 7న హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఆర్జీవీ కోరారు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణపై ఉత్కంఠ నెలకొంది.

News February 6, 2025

BREAKING: భారత్ విజయం

image

ENGతో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు జైస్వాల్ (15), రోహిత్ (2) వెంటనే ఔటైనా గిల్ (87), అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52) రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రెండో వన్డే ఈనెల 9న కటక్ వేదికగా జరగనుంది.

News February 6, 2025

ఏనుగులూ పగబడతాయ్!

image

పాము పగబడుతుందని పెద్దలు చెప్తే విన్నాం. అలాగే ఏనుగులు సైతం తమకు నచ్చని వ్యక్తులపై పగ పెంచుకుంటాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ‘ఎవరైనా తమకు నష్టం కలిగిస్తే ఏనుగులు వారిని గుర్తు పెట్టుకుంటాయి. ఎంతమందిలో ఉన్నా వారిని గుర్తించి దాడి చేస్తాయి. ఇలాంటి ఘటనే ఇటీవల చిత్తూరులో జరిగింది. అటవీ శాఖకు చెందిన ఓ వ్యక్తి ఏనుగుతో మిస్ బిహేవ్ చేయడంతో 20 మందిలో ఉన్నా అతణ్నే చంపేసింది’ అని చెప్పారు.

error: Content is protected !!