News February 6, 2025
బెల్లంపల్లిలో పెద్దపులి సంచారం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738828951226_51297756-normal-WIFI.webp)
గత కొన్ని రోజులుగా బెల్లంపల్లి, కాసిపేట మండలాల అటవీ పరిసర ప్రాంత గ్రామాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న పెద్దపులి రేంజ్ పరిధిలో ఆవాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నట్లుగా అటవీశాఖ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గురువారం పెద్దనపల్లి గ్రామపంచాయతీ మన్నెగూడ గ్రామ శివారులో పులి అడుగులను అధికారులు గుర్తించారు. కాగా ఎటువైపు నుంచైనా పశువులపై దాడి చేస్తుందోనని రైతులు భయాందోళనలకు గురవుతున్నారు.
Similar News
News February 6, 2025
రేపు ఒంగోలులో ఆర్జీవీ విచారణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737611577062_81-normal-WIFI.webp)
AP: సినీ దర్శకుడు రాంగోపాల్వర్మను రేపు ఒంగోలు రూరల్ పీఎస్లో పోలీసులు విచారించనున్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని గతంలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు రావాలని రెండుసార్లు పోలీసులు నోటీసులిచ్చినా వర్మ హాజరుకాలేదు. తాజాగా ఫిబ్రవరి 4న మరోసారి సమన్లు ఇవ్వగా ఈనెల 7న హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఆర్జీవీ కోరారు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణపై ఉత్కంఠ నెలకొంది.
News February 6, 2025
BREAKING: భారత్ విజయం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738852236716_367-normal-WIFI.webp)
ENGతో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు జైస్వాల్ (15), రోహిత్ (2) వెంటనే ఔటైనా గిల్ (87), అయ్యర్ (59), అక్షర్ పటేల్ (52) రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రెండో వన్డే ఈనెల 9న కటక్ వేదికగా జరగనుంది.
News February 6, 2025
భువనగిరి లాడ్జీల్లో పోలీసుల తనిఖీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738852954059_52242460-normal-WIFI.webp)
భువనగిరిలోని పలు లాడ్జీలను తనిఖీ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివేరా, డాల్ఫిన్, ఎస్వీ, ఎస్ఆర్ లాడ్జీలను చెక్ చేశామన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటున్నారా అని లాడ్జి యాజమాన్యాన్ని ఆరా తీసినట్లు చెప్పారు. MLC ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినట్లైతే తమకు సమాచారం అందించాలన్నారు. సీఐ సురేశ్ కుమార్, ఎస్సైలు లక్ష్మీనారాయణ, కుమారస్వామి పాల్గొన్నారు.