News February 6, 2025
రేపు ఒంగోలులో ఆర్జీవీ విచారణ

AP: సినీ దర్శకుడు రాంగోపాల్వర్మను రేపు ఒంగోలు రూరల్ పీఎస్లో పోలీసులు విచారించనున్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని గతంలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు రావాలని రెండుసార్లు పోలీసులు నోటీసులిచ్చినా వర్మ హాజరుకాలేదు. తాజాగా ఫిబ్రవరి 4న మరోసారి సమన్లు ఇవ్వగా ఈనెల 7న హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఆర్జీవీ కోరారు. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణపై ఉత్కంఠ నెలకొంది.
Similar News
News March 19, 2025
IPL అభిమానులకు పోలీసుల సూచన!

ఉప్పల్ స్టేడియంలో ఆదివారం నుంచి IPL మ్యాచులు జరగనున్నాయి. ఈక్రమంలో స్టేడియంలోకి తేకూడని వస్తువులను పోలీసులు సూచించారు. ‘కెమెరాలు& రికార్డింగ్ పరికరాలు, బ్లూటూత్ హెడ్ఫోన్స్ & ఎయిర్పాడ్స్, సిగరెట్, అగ్గిపెట్టె, కత్తులు, గన్స్, వాటర్ & ఆల్కహాల్ బాటిల్స్, పెట్స్, తినుబండారాలు, బ్యాగ్స్, ల్యాప్టాప్స్, సెల్ఫీ స్టిక్స్, హెల్మెట్, బైనాక్యులర్, టపాసులు, డ్రగ్స్’ వంటివి తీసుకురాకూడదని పోలీసులు తెలిపారు.
News March 19, 2025
ఫ్రిజ్లో 12 టన్నుల మేక మాంసం..!

హైదరాబాద్లోని మంగళ్హట్లో రూ.8 లక్షలు విలువ చేసే 12 టన్నుల మేక మాంసాన్ని GHMC టాస్క్ ఫోర్స్ సిబ్బంది సీజ్ చేశారు. మహమ్మద్ అఫ్రోజ్ అనే వ్యాపారి తక్కువ ధరకు గొర్రెలు, మేకల మాంసాన్ని కొని ప్రిజ్లో భద్రపరుస్తున్నట్లు గుర్తించారు. ఇలా నిల్వచేసిన మాంసాన్ని హోటళ్లు, శుభకార్యాలకు సప్లై చేస్తున్నట్లు తేల్చారు. ఈ ఘటనతో రెస్టారెంట్లలో తినే ముందు ఆలోచించాల్సిందేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
News March 19, 2025
విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల్లో కదలిక

AP: విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల సీఎంపీ(Comprehensive Mobility Plan) కోసం కేంద్ర ప్రభుత్వం AP మెట్రో రైల్ కార్పొరేషన్కు నిధులు మంజూరు చేసింది. ఈ మెట్రో ప్రాజెక్టుల మొబిలిటీ ప్లాన్ గడువు ముగిసింది. దీంతో మరోసారి ప్లాన్ రూపొందించాలని సెంట్రల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ విభాగం కోరింది. కేంద్రం సూచనలతో విశాఖలో రూ.84.47లక్షలు, విజయవాడలో రూ.81.68లక్షలతో సిస్ట్ర MVA సంస్థ ప్లాన్ రూపొందించనుంది.